ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఫైర్ అయ్యాడు. బండి బండరాం బయటపెడుతా అని అన్నారు. బండి సంజయ్ మీద కరీంనగర్ నుండి మాకు వందలాది కాల్స్ వస్తున్నాయి… బండి సంజయ్ ని ఎంపీ పదవి నుండి దింపే వరకు ఉరుకోను. పూర్తి ఆధారాలతో బండి సంజయ్ పై మీడియా సమావేశం పెడుతా. నేను భయపడే వ్యక్తి ని కాదు…బయపడితే రాజకీయాల్లో ఉండలేను. దళితుల పై దాడి చెసా అంటున్నారూ నేను ఎక్కడ లేను సిసి టీవీ ఫుటేజ్ చూడండి అని తెలిపారు. బండి సంజయ్ నువ్వు నీ ఇఫ్లూఎన్స్ ఉపయోగించిన నేను జైల్లో ఉండి కూడా నీ గురించి మాట్లాడుతా. నువ్వు ఒక మీద చంప కొడితే నేను రెండు చెంపలు కొట్టే వాడిని అని ఎమ్మెల్యే మైనంపల్లి పేర్కొన్నారు.