Transco, Genco CMD PrabhakarRao: కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇవ్వకుండా పవర్ పర్చేస్ జరపకుండా ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. 20 మిలియన్ యూనిట్స్ ఇవాళ డ్రా చేయలేకుండా పోయాం. ఇలా ఎందుకు జరిగింది అనేది అర్థం కావడం లేదు. జనరేటర్, డిస్కంలకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఉంటుంది ఇది వారి ఒప్పందంతో అమ్ముకోవచ్చు. రూ.1360 కోట్లు మనం కట్టినప్పటికి ఇలా చేయడం చాలా బాధాకరం. మనం పేమెంట్ చేసిన ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. పవర్ ఎక్స్చేంజి పై ఇవాళ సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రజలకు, వినియోగదారులకు సాధ్యమైనంత ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయండి సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో వర్షాలు బాగా పడడంతో జల విద్యుత్ ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం.
Also Read
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
థర్మల్, హైడల్, సోలార్ పవర్ చాలా బాగా ఉత్పత్తి చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో 12214 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిన ఎక్కడ కూడా సరఫరాకు అంతరాయం రాకుండా సరఫరా చేశాము.రైతన్నలు, ప్రజలు వినియోగదారులు ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.హైకోర్టు స్టే ఉన్నప్పటికి ఇలా చేయడం బాధాకరం.బకాయిలు చెల్లింపు చేసినప్పటికీ ఇలా చేయడం విచారకరం.ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదన్నారు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు.
రానున్న ఒకటి రెండు రోజుల్లో సరఫరా లో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు సహకటించాలని కోరుతున్నాం.ఇలా విద్యుత్ పర్చేస్ కాకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి,అంతేకాదు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలది ఎలాంటి తప్పులేదు.రాష్ట్రంలో జల విద్యుత్, థర్మల్, సోలార్ విద్యుత్ ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం.ఉదయం, సాయంత్రం ఎక్కువగా రైతులు పంపు సెట్లు ఆన్ చేస్తారు కాబట్టి ఆ సమయంలో కొంత ఎక్కువ డిమాండ్ వస్తుంది.త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి రైతన్నలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు.
Read Also: Soldier Killed: ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి.. జవాన్ వీరమరణం
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!