Madhu Goud Yaski: నారాయణ కాలేజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని రామంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ప్రభుత్వం వెనువెంటనే తీవ్ర చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. నారాయణ యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులతో సహా హత్యనేరం కేసులు నమోదు చేయాలి. నారాయణ విద్యాసంస్థల అనుమతులు వెంటనే రద్దు చేయాలి.ఇది కల్వకుంట్ల కుటుంబ స్కామ్. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థి విద్యాసంవత్సరం కోల్పోతాడు.. ఫీజులు కట్టకపోతే వేరే మార్గాల ద్వారా తీసుకోవాలి తప్ప.. సర్టిఫికెట్లు ఇవ్వవద్దని ఏ చట్టంలోనూ లేదన్నారు మధు యాష్కీ.
నారాయణ యాజమాన్యం చేసింది.. రాజ్యాంగ వ్యతిరేక చర్య.. ఇది అత్యంత హేయమైన, దారుణమైన చర్యగా అభివర్ణిస్తున్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో కార్పరేట్ కాలేజీలు దోచుకుంటున్నాయని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మండల కేంద్రాల్లోకి సైతం నారాయణ చైతన్య కాలేజీలు విస్తరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో సైతం ఇవి లేవు. మండల కేంద్రాలకు సైతం నారాయణ, చైతన్య విద్యాసంస్థలు వచ్చి.. ప్రజల రక్తాన్ని తాగుతున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు… తగిన చర్యలు తీసుకోలేదు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
నారాయణ సంస్థల్లో మంత్రి హరీష్ రావు, బిడ్డ కవితలకు భాగస్వామ్యం ఉండడం వల్లే చర్యలు తీసుకోవడం లేదనే వార్తలు వస్తున్నయి. వీరి అండదండలు ఉండడం వల్లే ఈ కాలేజీలే ఇలే పెట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఈ ఘటన తరువాత కూడా చర్యలు తీసుకోకపోతే హరీష్ రావు, కవితలకు భాగస్వామ్యం ఉన్నట్లు నిరూపితం అవుతుంది. ఈఘటనకు మొత్తం బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు మధుయాష్కీ. నారాయణ, చైతన్య కాలేజీలు టీవీలు,పేపర్లలో ప్రకటనల కోసమే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయంటే.. ఎన్ని వేల కోట్ల రూపాయలను ప్రజలనుంచి పీడిస్తున్నారో అర్థం అవుతోంది. గాయపడ్డ విద్యార్థులకు నారాయణ యాజమాన్యం మెరుగైన చికిత్సను అందించాలి. తెలంగాణలోని ప్రవేట్ టీచర్లు అంతా మేల్కోవాలన్నారు మధు యాష్కీ.
Read Also: Soldier Killed: ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి.. జవాన్ వీరమరణం
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!