Traffic Diversions: హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ప్రధానంగా.. ఆగస్టు 15న గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆంక్షల సమయంలో రామ్దేవ్గూడ నుండి గోల్కొండ కోట వరకు రహదారిని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
Read also: Shiva Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే వాహన ప్రమాదాలు ఉండవు
అయితే స్వతంత్ర వేడుకల్లో పాల్గొనే వారికి అధికారులు ఇప్పటికే పాస్లు జారీ చేశారు. ఆ మార్గంలో ఎ-గోల్డ్, ఎ-పింక్, బి-బ్లూ పాస్లు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. సీ, డీ, ఈ పాస్లు ఉన్నవారిని ఇతర మార్గాల ద్వారా అనుమతిస్తామని తెలిపారు. బాటసారులు ఉన్నట్లయితే, సికింద్రాబాద్ నుండి వచ్చే వారు బంజారాహిల్స్, మెహిదీపట్నం, రేతిబౌలి, నాలానగర్, లంగర్ హౌస్ వంతెన, రాందేవ్గూడ మీదుగా గోల్కొండకు చేరుకోవాలి. ఇంకా.. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో వాహనదారులకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఈ బ్లాక్ పాస్ ఉన్న సామాన్య ప్రజలు తమ వాహనాలను హుడా పార్కులో పార్క్ చేసి వేడుకలకు హాజరుకావాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Tirumala Cheetah: తిరుమల కాలినడక భక్తులకు ఊరట.. బోనులో చిక్కిన చిరుత!