NTV Telugu Site icon

Revanth Reddy: హత్యలు, అత్యాచారాలు దాటి.. పోలీసు వాహనాలపై దాడులు

Revanth

Revanth

ఇటీవల మహిళలపై జరుగుతున్న ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు కామెంట్లు చేశారు. హైదరాబాద్​ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్​చల్ సృష్టించిన దానిపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే అంటూ ట్వీట్ చేశారు. ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసిన వీడియోను పోస్ట్ చేశారు. వాహనం అద్దాలు ధ్వంసం చేశారని మండిప‌డ్డారు.

మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి.. పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా!? అంటూ ప్రశ్నించారు. పౌర సమాజం రాష్ట్రంలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌పై ఆలోచన చెయ్యాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

అయితే.. నిన్న అర్థ‌రాత్రి హైదరాబాద్​ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో యువకులు హల్​చల్‌ చేశారు. గంజాయి సేవించి మ‌త్తులో పోలీసు వాహ‌నం పై ఎక్కి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే.. స్థానిక స‌మాచారంతో ఘ‌ట‌న స్థ‌లికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులో తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా వాహనంపైకి ఎక్కి నానా హంగామా చేయ‌డ‌మే కాకుండా..

పోలీసు వాహనంతో పాటు ఇతర వాహనాల అద్దాలు పగలగొట్టారు. స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు పోలీసులు. అయితే .. ఈ క్రమంలో కొందరు తప్పించుకోగా..అజయ్‌ అనే యవకుడిని అసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.