Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9am 24 08 2025

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Published Date :June 24, 2025 , 9:12 am
By Gogikar Sai Krishna
  • పాలు పగిలినై.. గట్లెట్ల పలుగుతై.. పోలీస్ స్టేషన్ కు బాధితుడు
  • డ్రగ్స్ కేసులో నటుడు 'శ్రీరామ్' కు రిమాండ్
  • నేడు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ.. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చ!
  • ఇరాన్‌ నుంచి.. ఢిల్లీ చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు!
Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడే ఏపి క్యాబినెట్ భేటీ.. పలు ప్రాజెక్టులకు ఆమోదం..!

నేడు (జూన్ 24) ఉద‌యం 11 గంట‌ల‌కు ఏపి క్యాబినెట్ భేటీ అమ‌రావ‌తి వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఇందులో భాగంగా.. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన‌ 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ సమావేశంలో వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటు కు సంబంధించి చర్చ జరగనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలవడానికి కూడా ఆమోదం తెల‌ప‌నుంచి క్యాబినెట్. సీడ్ యాక్సెస్ రోడ్ ను నేషనల్ హైవే – 16 కు కలిపేందుకు 682 కోట్లతో టెండర్లు పిలిచెందుకు సంబంధిచి క్యాబినెట్ లో అమోదం తెల‌ప‌నున్నారు.

Also Read

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
  • RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
  • Bank Fraud: SBI బ్యాంక్‌లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్‌తో పాటు..
  • Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?

నేడు రూ.300ల దర్శన టికెట్స్ విడుదల.. వసతి గదులు కోటా కూడా..!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆన్‌లైన్ దర్శన టికెట్లను నేడు (జూన్ 24) విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ రూ.300 దర్శన టికెట్లు అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల కానున్నాయి. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ లేదా టీటీడీ అధికారిక యాప్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి లలోని వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు తమ ప్రయాణ తేదీలను అనుసరించి గదుల బుకింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు వీలైనంత త్వరగా టికెట్లు, గదులను బుక్ చేసుకుంటే స్వామి దర్శన సమయంలో సౌకర్యంగా ఉంటుంది. ఇక సోమవారం నాడు అంగప్రదక్షణ టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇరాన్‌ నుంచి.. ఢిల్లీ చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు!

ఇజ్రాయెల్‌ -ఇరాన్‌ ఘర్షణ సంక్లిష్ట రూపం దాల్చిన నేపథ్యంలో.. అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి ‘ఆపరేషన్ సింధు’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌ సింధులో భాగంగా ఇరాన్‌ నుంచి 10 మంది ఏపీ విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ నుంచి వచ్చే బాధితుల కోసం విదేశాంగశాఖ ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ నుంచి వచ్చే బాధితుల కోసం ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లలో రెండు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. విద్యార్థులను ఢిల్లీ నుంచి స్వస్థలానికి పంపేందుకు రెసిడెంట్‌ కమిషనర్లు 2 టీమ్‌లను నియమించారు. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన విదేశాంగ శాఖ ఇప్పటి వరకు దాదాపు 1750 మంది భారతీయులను ఇరాన్ నుండి స్వదేశానికి చేర్చింది. ఇప్పటికే బీహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుండి విద్యార్థులు వచ్చారు.

 

పోలీస్ కస్టడీకి వీరయ్య చౌదరి హత్య కేసు నిందితులు!

టీడీపీ నేత, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో నలుగురు నిందితులను జూన్ 24 నుంచి 27 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన బోర్లగుంట వినోద్ కుమార్, ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి, గోళ్ల రుత్యేంద్రబాబు, ఓబిలి నాగరాజును పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. నేటి నుంచి నిందితులు నలుగురిని పోలీసులు విచారించనున్నారు. ఏప్రిల్ 22న ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురయ్యారు. 22న సాయంత్రం 7.30 గంటల సమయంలో ఒంగోలులోని ఆయన కార్యాలయంలో విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసింది కిరాయి ముఠా. నిందితులు వీరయ్య చౌదరిని 53 సార్లు పొడిచి హతమార్చిన అనంతరం స్కూటీ, ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. 50 బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముందుగా అమ్మనబ్రోలు, నాగులుప్పలపాడుకు చెందిన ప్రధాన అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పోలీసులు కస్టడీకి కోరారు. హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ముప్పా సురేష్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నాడు.

నేడు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ.. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చ!

నేడు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ జరగనుంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సోమవారం రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయిన విషయం తెలిసిందే. సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమాశేం జరిగింది. మరోవైపు ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం కానుంది. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన‌ 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ ఆమోదం తెల‌ప‌నుంది. విశాఖలో కాగ్నిజెంట్ ఏర్పాటుకు సంబంధించి చర్చించనున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. అమ‌రావ‌తి రెండో ద‌శ‌లో 44 వేల ఎక‌రాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేక‌రించే అంశంలో కేబినెట్‌లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపులకు అమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఏడాది పాల‌న పూర్తియిన సంద‌ర్బంగా కేబినెట్‌లో చ‌ర్చ‌ జరగనుంది. కేబినెట్‌ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.

పాలు పగిలినై.. గట్లెట్ల పలుగుతై.. పోలీస్ స్టేషన్ కు బాధితుడు

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో అరుదైన కేసు నమోదైంది. సాధారణంగా చోరీలు, ఘర్షణలు, ఆస్తి వివాదాల ఫిర్యాదులు వస్తుంటే… ఈసారి మాత్రం పాలు పగిలిపోయాయని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. సంఘటన కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో చోటు చేసుకుంది. బాధితులు కొనుగోలు చేసిన హెరిటేజ్ పాకెట్ పాలలో మొదటి ప్యాకెట్ కాచినప్పుడు సాధారణంగానే కనిపించిందని, అయితే రెండవ ప్యాకెట్ కాచేసరికి పూర్తిగా పగిలిపోయిందని తెలిపారు. ఇది ఏంటని అడిగితే, దుకాణదారుడు బాధ్యత వహించలేమని తేల్చి చెప్పారు. దీంతో అసంతృప్తికి గురైన బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు.

చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. కేబుల్‌ కత్తిరించి..!

ముంబై నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీ దోపిడీ జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు రైలు బోగీల్లోకి ప్రవేశించి.. ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దుండగులు పథకం ప్రకారం కోమలి రైల్వే స్టేషన్‌ సమీపంలో రైల్వే సిగ్నల్ వ్యవస్థకు చెందిన కేబుల్‌ను కత్తిరించారు. దీంతో సిగ్నల్ అందక చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిచిపోయింది. రైలు ఆగిన వెంటనే దుండగులు బోగీల్లోకి ప్రవేశించి.. ప్రయాణికులను కత్తులతో బెదిరించారు. ప్రయాణికుల వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. అనంతరం దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. 22159 రైల్లో యస్-1 భోగిలో గుత్తికి చెందిన విశాలాక్షి అనే మహిళ మెడలో నుంచి సుమారు 27 గ్రాముల బంగారు చైన్‌ను దుండగులు లాక్కెళ్లారు.

పాలు పగిలినై.. గట్లెట్ల పలుగుతై.. పోలీస్ స్టేషన్ కు బాధితుడు

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో అరుదైన కేసు నమోదైంది. సాధారణంగా చోరీలు, ఘర్షణలు, ఆస్తి వివాదాల ఫిర్యాదులు వస్తుంటే… ఈసారి మాత్రం పాలు పగిలిపోయాయని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. సంఘటన కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో చోటు చేసుకుంది. బాధితులు కొనుగోలు చేసిన హెరిటేజ్ పాకెట్ పాలలో మొదటి ప్యాకెట్ కాచినప్పుడు సాధారణంగానే కనిపించిందని, అయితే రెండవ ప్యాకెట్ కాచేసరికి పూర్తిగా పగిలిపోయిందని తెలిపారు. ఇది ఏంటని అడిగితే, దుకాణదారుడు బాధ్యత వహించలేమని తేల్చి చెప్పారు. దీంతో అసంతృప్తికి గురైన బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు.

డ్రగ్స్ కేసులో నటుడు ‘శ్రీరామ్’ కు రిమాండ్

తెలుగు, తమిళ్ హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు శ్రీరామ్ ను డ్రగ్స్ కేసులో పోలీసులు చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. తమిళనాడుకు అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పోలీసులకు సమాచారం రావడంతో అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసారు. పోలీసుల స్టైల్ లో విచారణ చేపట్టగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేస్తామని నిందితులు తెలిపారు. రంగమంలోకి దిగిన పోలీసులు శ్రీరామ్ అదుపులోకి తీసుకుని ఆయన వద్ద నుండి కొకైన్ స్వాదీనం చేసుకున్నారు. అనంతరం శ్రీరామ్ ను అరెస్ట్ చేసారు. వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాల సేకరించి నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు పోలీసులు. తదుపరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శ్రీరామ్ ను కోర్టులో హాజరుపరచగా జులై ఏడవ తేది వరకు రిమాండ్ విధించింది చెన్నై ఎగ్మోర్ కోర్టు. ఈ నేపథ్యంలో నటుడు శ్రీరామ్ ని కస్టడీ కోరుతూ నేడు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు నుంగంబాకం పోలీసులు. శ్రీరామ్ ను విహచరిస్తే కోలీవుడ్ కు చెందిన పలువురు నటుల పేర్లు బయటకు వస్తాయని భావిస్తున్నారు. అన్నాడీఎంకే కు చెందిన ప్రసాద్ కు పలువురి తమిళ సినిమా నటులతో పరిచయాలు ఉన్నాయని అటువైపుగా కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. శ్రీరామ్ డ్రగ్స్ లో ఇతర నటినటులు ఎవరు ఉన్నారు. అసలు ఈ డ్రగ్స్ ఎలా తెస్తున్నారు. ఎవరు దీని వెనకఉన్నారు అని పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap Cabinet
  • Chengalpattu Express
  • hero sriram
  • iran israel war
  • Nara Lokesh

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions