Festival of Ponds: నేడే రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పండగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Festival of Ponds: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా చెరువుల పండగను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువుల పండుగ నిర్వహించనున్నారు. చెరువుల వద్ద కట్ట మైసమ్మ పూజలు నిర్వహించడంతో పాటు బోనాలు, బతుకమ్మలు, ప్రగతి నివేదికల సమర్పణకు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం మిషన్ కాకతీయ డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులతో పాటు మిషన్ కాకతీయ దాతలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,531 చెరువులున్నాయి. వాటి కింద 24.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు గుర్తించారు. దాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2015 మార్చి 12న నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ పాత చెరువు వద్ద ‘మిషన్ కాకతీయ’ పనులను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు నాలుగు దశల్లో రూ.9,155 కోట్లతో 27,527 చెరువులను పునరుద్ధరించారు. దీంతో ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలకు పైగా పెరిగింది. ఇప్పటి వరకు 15 వేలకు పైగా చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేశారు. ఆయా పంట కాల్వలకు ఓటీలు ఏర్పాటు చేసి ప్రాజెక్టు నీటితో సక్రమంగా చెరువులను నింపుతున్నారు.
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
దీంతో ఎండా కాలంలో కూడా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉండడంతో చెరువులు నిండుతున్నాయి. మరోవైపు వాగుల పునరుజ్జీవ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 1200 చెక్డ్యామ్లు నిర్మించాలని భావించగా, ఇప్పటికే 650 పనులు ప్రారంభించగా 400 పూర్తయ్యాయి. దీంతో ఒకవైపు పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండగా, మరోవైపు సంబంధిత రంగాల విస్తరణ శరవేగంగా సాగుతోంది. మత్స్య పరిశ్రమ కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా పశువులకు, పాడి పశువులకు నీటి కొరత ఉండదు. తెలంగాణ ఇప్పుడు డెయిరీ అభివృద్ధికి చిరునామా. పశువులు మరియు పాల పెరుగుదలతో పాటు, ఇతర నిపుణులకు కూడా ఈ రోజు కొత్త అవకాశాలు ఉన్నాయి.
New York: న్యూయార్క్లో తీవ్ర స్థాయిలో కాలుష్యం
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!