RS Praveen kumar: బీజేపీకి మద్దతు ఇచ్చేదే లేదు.. ఆర్ఎస్ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RS Praveen kumar: బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నా కానీ.. బీజేపీకి ఎప్పటికీ మద్దతివ్వబోమని తేల్చి చెప్పారు. ఒకే దేశం-ఒకే మతం అంటూ బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయని అన్నారు. ఇప్పటికే గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజల్లోకి వెళ్లి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. అనేక హామీలు గుప్పిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ టార్గెట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎత్తుగడలు వేస్తున్నారు.
Read also: NTR centenary celebrations: ఎమ్మెల్యేను బుల్లెట్ ఎక్కించుకున్న మాజీ మంత్రి
Also Read
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
తాజాగా హైదరాబాద్లో బీఎస్పీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి హాజరయ్యారు. ఈ సభలో బీఎస్పీ తరపున తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రకటించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీ పుంజుకుంది. గత ఎన్నికల్లో కూడా బీఎస్పీ తరపున అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఎస్పీ నాలుగు వేలకు పైగా ఓట్లను సాధించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు బీఎస్పీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్నట్లు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాజా వ్యాఖ్యలతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ ఎవరికి మద్దతు ఇస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Lakshmi Parvathi: ఎన్టీఆర్ నిజమైన వారసుడు ఆయనే.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..