Butcher Son: తల్లిని రోకలిబండతో కొట్టిచంపిన కొడుకు.. అలా చేసేందుకు ప్లాన్ వేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Butcher Son: నవమాసాలు మోసి కని పెంచి కంటికి రెప్పలా కాపాడుకుని 9 నెలలు కన్న బిడ్డ బరువును మోసి తనకు ప్రపంచాన్ని చూపే ఆతల్లికి కోటి దండాలనే చెప్పాలి. కడుపులో వున్నప్పుడు బరువు నెల నెల పెరుగుతున్న అది తీయ్యని కష్టంగానే భావించి ఆస్వాదిస్తూ తన నలుసు బయటకు వచ్చినప్పటి నుంచి ఎంత కష్టం వచ్చినా అది భరిస్తూ.. తన కడుపును మాడ్చుకుని కన్న బిడ్డ కడుపు నిండితే చాలని అనుకుంటుంది తల్లి. తన బుల్లి బుల్లి మాటలకు మంత్రముగ్దులై వారు ఏంచెప్పినా నవ్వుతూ ఆడిస్తూ పెంచుకుంటూ వస్తుంది. తీరా పెద్దయ్యాక కడుపులో పెట్టుకుని పెంచిన తల్లిని కడతేర్చడానికి పూనుకుంటున్నారు బిడ్డలు. దానికి గల కారణం డబ్బు. వ్యసనాలు, కష్టపడాలంటే చాతకాని తనం, డబ్బులు విచ్ఛలవిడిగా ఖర్చుపెట్టి దాగి తందనాలు ఆడటానికి వారికి కావాల్సింది డబ్బు మాత్రమే. దానిముందు కన్న తల్లి అయినా కుటుంబ సభ్యులైనా వారి కంటిముందు కనపడరు. డబ్బుతీసుకోవడానికి, వారి పై వున్న ఆస్తిని తీసుకునేందుకు కుటుంబ సభ్యులపైనే దాడులకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Harish Rao: ప్రముఖులు అంతా RBVRR హాస్టల్లో ఉన్నవారే..!
Also Read
- CM Revanth Reddy : రాహుల్నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్కు అదే నివాళి
- Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
- Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
- Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరు మండలం మద్దిగట్లలో దారుణం చోటుచేసుకుంది. తల్లి బీరమ్మతో పాటు తన కొడుకు వీరప్ప నివాసం ఉంటున్నారు. కొడుకు వ్యసనానికి బానిసై రోజూ డబ్బులకోసం తల్లి బీరమ్మను వేధించేవారు. చివరకు ఆస్తిమీద వీరప్పకు కన్ను పడింది. ఆస్తికోసం తల్లి బీరమ్మతో గొడవకు దిగాడు. దీంతో ఆస్తి రాసివ్వనని బీరమ్మ చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వీరప్ప ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు. ఆమెను చంపితే తనపేరు మీద వున్న ఆస్తిమొత్తం అతనికి వస్తుందని ఆశపడ్డాడు. ఇంట్లో వున్న రోకలిబండతో అతి కిరాతకంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ బీరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. అయితే మృతదేహాన్ని ఏం చేయాలనేది కాసేపు సమాలోచనలో పడ్డాడు వీరప్ప చివరికి ఒక ప్లాన్ వేశాడు. మృతదేహాన్ని కూర్చీలో కూర్చోబెట్టాడు. దొంగలు ఇంటికి దోచుకునేందుకు వచ్చారని వాళ్లని అడ్డుకునే ప్రయత్నంలో బీరమ్మను దొంగలే హత్యచేసినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే ఇరుగుపొరుగు వారు పోలీసులు సమచారం సేకరించాగా నిర్ఘాంత పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తల్లిని రోకలిబండతో చంపింది కొడుకు వీరప్పనే అని నిజాన్ని బయటపెట్టారు పోలీసులు. దీంతో చేసేది ఏమీలేక కోడు వీరప్ప కూడా తన నేరాన్ని అంగీకరించాడు. ఆస్తికోసమే తల్లిని చంపినట్టు పోలీసులముందు నేరాన్ని అంగీకరించాడు.
KTR: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి
తాజావార్తలు
-
Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
-
Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!