పోడు భూముల సమస్యకు పరిష్కారం లభించేనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోడు రైతులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ వచ్చినప్పటి నుంచి గిరిజనులు కోట్లాడుతున్న ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయలేదు. ఎన్నో సార్లు పోడు భూములపై ఇటు ఫారెస్ట్ అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వివాదం నడిచింది. కొన్ని సార్లైతే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గత కొన్ని రోజుల కిందట ఖమ్మంలోని కారేపల్లిలో పోడు సాగు చేస్తున్నందుకు అడ్డుకున్న బాలింత మహిళలపై అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపించారు. దీనిపై హ్యుమన్రైట్ కమిషన్, పలు మహిళా సంఘాలు సీరియస్ అయ్యాయి. దీంతో వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేశారు. హైకోర్టు ఈ ఘటనపై సీరియస్ అయింది.
ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు తాజాగా కేసీఆర్ ప్రభుత్వం రేపు పోడు భూములపై సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకు రావాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి నేతృత్వంలో శనివారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు, అఖిల పక్ష నేతలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశానికి అఖిల పక్ష నేతలతో పాటు అటవీ, గిరిజన, రెవెన్యూ శాఖల అధికారులు హాజరు కానున్నారు.
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
ఇప్పటివరకు పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు తదితరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పిండంతో పాటు, అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనైనా దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తే బాగుంటుందని గిరిజనులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!