Tragic Incident: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. 17 నెలల బాలుడిని బావిలో తోసేసిన తండ్రి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragic Incident: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన 17 నెలల కొడుకును బావిలో విసిరి ఆతరువాత తను ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారి నీటిలో మునిగి చనిపోగా, తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది.
రాములపల్లికి చెందిన కల్వల తిరుపతిరెడ్డికి భార్య మానస, కుమారుడు దేవాన్ష్ (17 నెలలు) ఉన్నారు. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కొన్నాళ్లుగా తిరుపతిరెడ్డి సోదరుడు రత్నాకర్ రెడ్డికి మధ్య భూమి విషయంలో వివాదం నడుస్తోంది. భూ సమస్యను పరిష్కరించకుంటే తిరుపతిరెడ్డిని చంపేస్తామని రత్నాకర్ రెడ్డి బంధువులు పలుమార్లు బెదిరించారు. ఈ బెదిరింపుల కారణంగా తిరుపతిరెడ్డి దాదాపు ఏడాది కాలంగా కుటుంబసభ్యులతో కలిసి సుల్తానాబాద్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. శుక్రవారం (ఆగస్టు 25) వరలక్ష్మి పూజ కోసం భార్య, కొడుకుతో కలిసి స్వగ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి సుల్తానాబాద్ చేరుకున్నాడు. శనివారం మరోసారి కొడుకు దేవాన్ష్ని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. నేరుగా పొలంలోకి వెళ్లి చిన్నారి దేవాన్ష్ను బావిలో పడేశాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. రాములపల్లికి వెళ్లిన భర్త, కొడుకు మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో మానస తన మామ సంజీవరెడ్డి (తిరుపతిరెడ్డి తండ్రి) సంజీవరెడ్డికి ఫోన్ చేసింది. అయితే తిరుపతిరెడ్డి ఇంటికి రాలేదని సంజీవ రెడ్డి తెలిపారు.
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
Read also: Tip for Women: మహిళలకు అదిరిపోయే చిట్కా.. ఆ సమయంలో ఈ జ్యూస్ తాగితే..!
మామ సంజీవరెడ్డికి అనుమానం వచ్చి పొలానికి వెళ్లి చూడగా షాక్ తిన్నాడు. తిరుపతిరెడ్డి బావి ఒడ్డున అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. కంగారుపడిన సంజీవరెడ్డి మనవడి కోసం వెతకగా బావిలో అనుమానాస్పదంగా చూడగా చెప్పులు నీటిపై తేలియాడుతూ ఉండడం గమనించాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని తిరుపతిరెడ్డిని సుల్తానాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బావిలోని నీటితో చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. తిరుపతిరెడ్డి భార్య మానస ఫిర్యాదు మేరకు పోలీసులు రత్నాకర్ రెడ్డి, అతని మామ సత్తిరెడ్డి, బావ లక్ష్మణ్లపై కేసు నమోదు చేశారు. చిన్నారి మృతితో పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. భూవివాదంలో చిన్నారి మృతి చెందడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Ram: రజినీ హుకుమ్ సౌంగ్ తో బాలయ్యకి ఎలివేషన్… షేక్ అవుతున్న సోషల్ మీడియా
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!