Banjara Hills Police: స్టోర్స్ అద్దాలను ధ్వంసం ఘటన.. ఛేదించిన బంజారాహిల్స్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banjara Hills Police: కారులో ప్రయాణిస్తూ రోడ్డుపై కనిపించిన స్టోర్స్ అద్దాలను ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఘటనల్లో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రధాన రోడ్లపై ఉన్న స్టోర్స్, రెస్టారెంట్స్ తదితర వ్యాపార సముదాయాలకు చెందిన అద్దాలు ధ్వంసమవుతున్న విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే అద్దాలు ధ్వంసం చేస్తున్నారంటూ ఆయా షాపుల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో 8 స్టోర్స్ల అద్దాలు ధ్వంసమైన విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
Read also: Srikrishna: శ్రీకృష్ణుణ్ని పెళ్లాడిన యువతి.. వివాహ ప్రమాణ పత్రం కూడా..
Also Read
- Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
ఇక మొత్తం 18 స్టోర్లకు చెందిన అద్దాలు పగిలినట్లు గుర్తించిన పోలీసులు.. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అయితే.. గత నెల 20 నుంచి ఈ నెల 4 వరకు వివిధ సమయాల్లో అద్దాలు ధ్వంసమైనట్లు దర్యాప్తులో తేలింది. కాగా.. ఆ సమయాల్లో రోడ్డుపై వెళ్లిన వాహనాలను సీసీ కెమెరాల్లో పరిశీలించారు. అన్ని సమయాల్లోనూ ఓ మహేంద్ర జైలో కారు సదరు షాపుల ముందు నుంచి వెళ్లినట్లు బంజారాహిల్స్ పోలీసులు గుర్తించి కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మౌలాలిలోని బాగ్ హైదరీకి చెందిన కారు డ్రైవర్ సయ్యద్ మహబూబ్ హుస్సేన్ రిజ్వీ (47)ని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. కారు డ్రైవర్ రిజ్వీ ఓ సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన ఉద్యోగులను తీసుకువెళ్తుంటాడు.
Read also: Premikudu Re-release: థియేటర్స్ లో డాన్సులే.. ప్రేమికుడు రీరిలీజ్..
అయితే.. ఆ కారులో అప్పుడప్పుడు రిజ్వీతో పాటు అదే సంస్థలో కారు డ్రైవర్గా పని చేసే అంబర్పేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ కూడా ప్రయాణిస్తుంటాడు. ఇక అబ్దుల్ అమీర్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో కారులో నుంచే కాటాపుల్ట్లో గులకరాళ్లు పెట్టి గురిచూసి రోడ్డుకు పక్కనే ఉండే స్టోర్స్ అద్దాలు ధ్వంసం చేసిన విషయం బయటపడింది. కాగా.. ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం, ఫిర్యాదులు రావడంలో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ దాడులపై ఐపీసీ 308 రెడ్విత్ 34 సెక్షన్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితులను నిన్న (శుక్రవారం) రిమాండ్కు తరలించారు. దీంతో.. అద్దాలు పగలగొట్టడం ద్వారా పైశాచిక ఆనందం పొందడమే తన లక్ష్యమని, 18 స్టోర్ల అద్దాలు పగలగొట్టినట్లు నిందితుడు అబ్దుల్ అమీర్ తెలిపాడు.
Ram Mandir : అయోధ్య రామమందిరంలో నేటి నుంచి వీఐపీ దర్శనాలు షురూ
తాజావార్తలు
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!