అందుకే హుజురాబాద్లో దళిత బంధు ప్రారంభించాం : వినోద్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలిఉంది. దీంతో ప్రముఖ రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసమో ఎన్నికల కోసమో పథకాలు తీసుకువచ్చే పార్టీ కాదని, మా మేనిఫెస్టోలో లేని రైతుబంధు ఇచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు.
కేంద్ర బలగాలను దించి భయపెట్టాలని చూస్తున్నది బీజేపీయే అని ఆరోపించారు వినోద్… హుజురాబాద్లోనే ఆనాడు రైతు బంధు ప్రారంభించాము, అందుకే దళిత బంధు కూడా ఇక్కడి నుండి ప్రారంభించామని ఆయన వెల్లడించారు. కేసీఆర్ సభ కోసం వంద ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తే మోడల్ కోడ్ కారణాలు చూపిస్తూ జిల్లా మొత్తం ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చారన్నారు. పక్క జిల్లా లో సభ ఏర్పాటు చేద్దాం అంటే మళ్లీ రాష్ట్రం మొత్తం కోడ్ తీసుకు వస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ బహిరంగ సభ అంశం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉందని, ఇప్పటివరకు ఎలాంటి గొడవలు జరగకుండా ప్రచారాలు జరిగాయని, ఇక ముందు కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.
Also Read
- Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్కు సురేఖ ఫిర్యాదు.!
- Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
- Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
- ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
తాజావార్తలు
-
PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
-
Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్కు సురేఖ ఫిర్యాదు.!
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!