Talasani Srinivas: ఎవరుపడితేవాళ్లు అడిగితే ఇచ్చేవి కావు నంది అవార్డ్స్.. తలసాని కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Srinivas: నంది అవార్డులు అడిగిన వారికి ఇవ్వడం లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నంది అవార్డుల అంశంపై తలసాని స్పందించారు. నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. అని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ అడగలేదని చెప్పారు. కొందరు మీడియా చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నంది అవార్డులు అడిగిన వారికి ఇవ్వడం లేదని మంత్రి తలసాని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఏడాది సినిమాకు నంది అవార్డులు ఇచ్చేలా ఆలోచిస్తామని చెప్పారు. హైదరాబాద్ మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీలో దర్శక రత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Read also: KTR: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన..17 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Also Read
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
ఈ సందర్భంగా నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కొందరు సినీ ప్రముఖులు చేస్తున్న విమర్శలపై మంత్రి తలసాని స్పందించారు. నంది అవార్డుల విషయంలో బాధ్యులైన వారెవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో సహకారం అందిస్తుందన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎన్నోసార్లు ప్రశంసించారని మంత్రి గుర్తు చేశారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్లకు అనుమతులు ఇవ్వడం, ఐదో షో ఆడేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు అనేక రకాలుగా ప్రభుత్వం టాలీవుడ్కు అండగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డులు నిలిచిపోయిన మాట వాస్తవమేనన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. “దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. చిత్రపురి కాలనీకి దాసరి ఎంతో కృషి చేశారు. సినీ పరిశ్రమ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా ముందుకు సాగే వ్యక్తి దాసరి. ఆయన చిత్రాలు ఎంతో సందేశాత్మకంగా ఉన్నాయి. “దాసరి మరణానంతరం సినీ పరిశ్రమ దిక్కును కోల్పోయింది’’ అని మంత్రి తలసాని అన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగల్లుకు మోసగాడు’ రీరిలీజ్ కానున్న సందర్భంగా నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇచ్చేందుకు ఇరు ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ అవార్డుకు విలువ ఉండేదన్నారు. ఇప్పుడు అవార్డుకు విలువ లేకుండా పోయిందన్నారు.
తాజావార్తలు
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!