Talasani Srinivas: ఎవరుపడితేవాళ్లు అడిగితే ఇచ్చేవి కావు నంది అవార్డ్స్.. తలసాని కీలక వ్యాఖ్యలు
Talasani Srinivas: నంది అవార్డులు అడిగిన వారికి ఇవ్వడం లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నంది అవార్డుల అంశంపై తలసాని స్పందించారు. నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. అని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ అడగలేదని చెప్పారు. కొందరు మీడియా చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నంది అవార్డులు అడిగిన వారికి ఇవ్వడం లేదని మంత్రి తలసాని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఏడాది సినిమాకు నంది అవార్డులు ఇచ్చేలా ఆలోచిస్తామని చెప్పారు. హైదరాబాద్ మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీలో దర్శక రత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Read also: KTR: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన..17 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
ఈ సందర్భంగా నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కొందరు సినీ ప్రముఖులు చేస్తున్న విమర్శలపై మంత్రి తలసాని స్పందించారు. నంది అవార్డుల విషయంలో బాధ్యులైన వారెవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో సహకారం అందిస్తుందన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎన్నోసార్లు ప్రశంసించారని మంత్రి గుర్తు చేశారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్లకు అనుమతులు ఇవ్వడం, ఐదో షో ఆడేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు అనేక రకాలుగా ప్రభుత్వం టాలీవుడ్కు అండగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డులు నిలిచిపోయిన మాట వాస్తవమేనన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. “దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. చిత్రపురి కాలనీకి దాసరి ఎంతో కృషి చేశారు. సినీ పరిశ్రమ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా ముందుకు సాగే వ్యక్తి దాసరి. ఆయన చిత్రాలు ఎంతో సందేశాత్మకంగా ఉన్నాయి. “దాసరి మరణానంతరం సినీ పరిశ్రమ దిక్కును కోల్పోయింది’’ అని మంత్రి తలసాని అన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగల్లుకు మోసగాడు’ రీరిలీజ్ కానున్న సందర్భంగా నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇచ్చేందుకు ఇరు ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ అవార్డుకు విలువ ఉండేదన్నారు. ఇప్పుడు అవార్డుకు విలువ లేకుండా పోయిందన్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!