KTR: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన..17 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: మంత్రి కేటీఆర్ శుక్రవారం హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు 12819 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 17అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో.. పట్టణప్రగతి, సిఎంఏ, మునిసిపల్ సాధారణ నిధులు, స్మార్ట్ సిటీ, స్టేట్ గవర్నమెంట్ ఫండ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఫ్లడ్ రిలీఫ్ పథకాల క్రింద రూ.12819 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 17అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వరంగల్ మహానగరపాలక సంస్థ, కుడా, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ 178.95 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. జిడబ్ల్యూ ఎంసీ ఆధ్వర్యంలో సిఎంఏ, స్మార్ట్ సిటీ పథకాల క్రింద రూ. 520 లక్షల తో చేపట్టిన 2 అభివృద్ధి పనులైన మోడల్ వైకుంఠ ధామం, సైన్స్ పార్క్ లను, తెలంగాణ స్టేట్ సైన్స్ టెక్నాలజీ కౌన్సిల్ నిధులతో రూ 850 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్సి , ఎస్టీ సెంటర్ లకు ప్రారంభోత్సవాలు చేస్తారు. అదేవిధంగా భద్రకాళి మాడ వీధులు, రూ 120 లక్షలతో అంతర్గత సిసి రోడ్ లకు శంకుస్థాపన, బిసి సంక్షేమ శాఖ నిధులతో 31 వ డివిజన్ లో రూ 586 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిసి కమ్యూనిటీ హాల్ లకు మంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.
Read also: honeytrap: హనీట్రాప్లో చిక్కుకున్న సైంటిస్ట్.. పాకిస్తాన్కు రహస్య సమాచారం చేరవేత
Also Read
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
మంత్రి కేటీఆర్ పర్యటనలో మధ్యాహ్నం భోజన విరామం తర్వాత నుండి వరంగల్ లో ప్రారంభమవుతుంది. వరంగల్ కిట్స్ కళాశాల మైదానానికి కేటీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్, ఎగ్జిబిషన్ తిలకిస్తారు. విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆతరువాత బిమారంలో ఏర్పటు చేసిన సమావేశంలో కెసిఆర్ కప్ ప్రైజ్ ప్రధానోత్సవం చేస్తారు. అనంతరం 4:30 నిమిషాలకు హనుమకొండ కు చేరుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఐదు గంటలకు లష్కర్ బజార్ లో ప్రభుత్వ హైస్కూల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహిస్తారు.సా.5.30గంటలకు నాయుడు పెట్రోల్ బంకు సమీపంలో వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయానికి భూమి పూజ, శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6 గంటలకు హన్మకొండలోని ఇందిరా నగర్ లో రైతుల రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకన్న ఇంటికి వెళతారు. సా.6.15 గం.లకు గాంధీనగర్ లో(అంబేద్కర్ భవన్, టి.వి టవర్ దగ్గర) మోడల్ వైకుంఠధామానికి ప్రారంభోత్సవం చేస్తారు. సా.6.45 గం.లకు సెయింట్ గ్యాబ్రిల్ స్కూల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు సాయంత్రం తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్ కి వెళ్లనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మంత్రి దాయకర్ రావు.. ఎమ్మెల్యేల అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
Harry Brook : ఏందీ హ్యారీ బ్రూక్ కాకా.. ఏ ఆర్డర్ లో వచ్చినా నీ ఆట మారాదా..
తాజావార్తలు
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!