KTR: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన..17 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: మంత్రి కేటీఆర్ శుక్రవారం హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు 12819 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 17అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో.. పట్టణప్రగతి, సిఎంఏ, మునిసిపల్ సాధారణ నిధులు, స్మార్ట్ సిటీ, స్టేట్ గవర్నమెంట్ ఫండ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఫ్లడ్ రిలీఫ్ పథకాల క్రింద రూ.12819 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 17అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వరంగల్ మహానగరపాలక సంస్థ, కుడా, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ 178.95 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. జిడబ్ల్యూ ఎంసీ ఆధ్వర్యంలో సిఎంఏ, స్మార్ట్ సిటీ పథకాల క్రింద రూ. 520 లక్షల తో చేపట్టిన 2 అభివృద్ధి పనులైన మోడల్ వైకుంఠ ధామం, సైన్స్ పార్క్ లను, తెలంగాణ స్టేట్ సైన్స్ టెక్నాలజీ కౌన్సిల్ నిధులతో రూ 850 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్సి , ఎస్టీ సెంటర్ లకు ప్రారంభోత్సవాలు చేస్తారు. అదేవిధంగా భద్రకాళి మాడ వీధులు, రూ 120 లక్షలతో అంతర్గత సిసి రోడ్ లకు శంకుస్థాపన, బిసి సంక్షేమ శాఖ నిధులతో 31 వ డివిజన్ లో రూ 586 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిసి కమ్యూనిటీ హాల్ లకు మంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.
Read also: honeytrap: హనీట్రాప్లో చిక్కుకున్న సైంటిస్ట్.. పాకిస్తాన్కు రహస్య సమాచారం చేరవేత
Also Read
- Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
- Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
మంత్రి కేటీఆర్ పర్యటనలో మధ్యాహ్నం భోజన విరామం తర్వాత నుండి వరంగల్ లో ప్రారంభమవుతుంది. వరంగల్ కిట్స్ కళాశాల మైదానానికి కేటీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్, ఎగ్జిబిషన్ తిలకిస్తారు. విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆతరువాత బిమారంలో ఏర్పటు చేసిన సమావేశంలో కెసిఆర్ కప్ ప్రైజ్ ప్రధానోత్సవం చేస్తారు. అనంతరం 4:30 నిమిషాలకు హనుమకొండ కు చేరుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఐదు గంటలకు లష్కర్ బజార్ లో ప్రభుత్వ హైస్కూల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహిస్తారు.సా.5.30గంటలకు నాయుడు పెట్రోల్ బంకు సమీపంలో వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయానికి భూమి పూజ, శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6 గంటలకు హన్మకొండలోని ఇందిరా నగర్ లో రైతుల రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకన్న ఇంటికి వెళతారు. సా.6.15 గం.లకు గాంధీనగర్ లో(అంబేద్కర్ భవన్, టి.వి టవర్ దగ్గర) మోడల్ వైకుంఠధామానికి ప్రారంభోత్సవం చేస్తారు. సా.6.45 గం.లకు సెయింట్ గ్యాబ్రిల్ స్కూల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు సాయంత్రం తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్ కి వెళ్లనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మంత్రి దాయకర్ రావు.. ఎమ్మెల్యేల అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
Harry Brook : ఏందీ హ్యారీ బ్రూక్ కాకా.. ఏ ఆర్డర్ లో వచ్చినా నీ ఆట మారాదా..
తాజావార్తలు
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!