Tension in Suryapet: తిమ్మారెడ్డిగూడెంలో ఉద్రిక్తత.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tension in Suryapet: సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడిగూడెంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. తిమ్మారెడ్డిగూడెంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. అయితే అక్కడకు వచ్చిన కళాకారులు జై భీమ్ అంటూ నినాదాలతో తిమ్మారెడ్డిగూడెం మారుమోగింది. కాగా అటునుంచి వెలుతున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి అక్కడున్న కళాకారుల దగ్గరకు వెళ్లి జై భీమ్ అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రశాంతంగా సాగుతున్న సభను అడ్డుకోవడం ఏంటని ఇది సరైన పద్దతి కాదని ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డిని మునగాల ఎస్సై లోకేష్ చెప్పారు. దీంతో అక్కడ గందగోళ పరిస్థితి నెలకొంది.కాగా.. అక్కడ పరిస్థితి చేయదాటడంతో పోలీసులు ఇరువుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
Read also: Jess Jonassen: బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్
Also Read
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
- TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
- BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
అయితే ఎస్సై లోకేష్ తనపై దాడి చేశాడంటూ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా శ్రీనివాస్ రెడ్డి వర్గం ఆందోళన చేపట్టింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఎంపీటీసీపై పోలీసులు దాడిచేయడం ఏంటి? అని ప్రశ్నించారు. నేను ఏ సభను అడ్డుకోలేదని పోలీసులే కావాలనే తనపై దాడి చేశారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సభ నిర్వహించారని, అక్కడి నుంచి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, తనను ఎస్సై లోకేష్ అడ్డుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నిస్తే మాపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే… అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కాన్వాయ్ ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. సీఐ జోక్యంతో అక్కడ నుంచి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెళ్లిపోయారు. అయితే.. తాను ఎవరిపై దాడి చేయలేదని మునగాల ఎస్సై లోకేష్ వివరణ ఇచ్చారు. సభను అడ్డుకోవడంతోనే అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.
Kedar Jadhav : ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్..
తాజావార్తలు
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
Super Subbu: నెట్ఫ్లిక్స్లో టాప్ లేపుతోన్న ‘సూపర్ సుబ్బు’.. హిందీ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన సెక్స్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్!
-
Lenin Pre Release Event: రేపే గ్రాండ్గా ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ సస్పెన్స్!
-
Prabhas Record: ప్రభాస్ సరికొత్త రికార్డ్.. రెబల్ స్టార్ కెరీర్లోనే..!
-
IBPS SO Recruitment 2026: 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. నెలకు రూ.85,000కు పైగా జీతం
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!