High Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు భగ్గు మంటున్నాయి. ఎండ వేడిమికి చాలా ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తె రాకముందే ఎండలతో జనం అల్లాడుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక దేశంలోనే ఉష్ణోగ్రతలు అత్యధికంగా కొత్తగూడెంలో నమోదయ్యాయి. తెలంగాణలో 8 జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చేవారం రోజులు తెలంగాణలో తీవ్ర వడగాలులు, పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Read also: Dead Boy Detectives OTT: ఓటీటీలో వచ్చేసిన థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగంటే?
Also Read
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత 45.5 డిగ్రీలకు చేరుకుంది. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5 డిగ్రీలు, కడప జిల్లా ఖాజీపేటలో 45.3, పల్నాడు జిల్లా మాచర్లలో 45.2, కర్నూలు రూరల్లో 44.9, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.6, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా కొత్తవలసలో 44.2, మన్యం సాలూరులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 41 మండలాల్లో భారీ వర్షాలు, 116 మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 183 మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Read also: Ponguleti Srinivasa Reddy: ధరణి అనే దయ్యాన్ని సరిదిద్ధు తున్నాం..
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆనుకుని ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగుతుందని, వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రానున్న నెలలో మరింత వేడి గాలులు మరియు పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
B Vinod Kumar: కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్, వినోద్ కుమార్ మధ్యనే పోటీ..
తాజావార్తలు
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్లోనే ఘోరం!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!