High Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
High Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు భగ్గు మంటున్నాయి. ఎండ వేడిమికి చాలా ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తె రాకముందే ఎండలతో జనం అల్లాడుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక దేశంలోనే ఉష్ణోగ్రతలు అత్యధికంగా కొత్తగూడెంలో నమోదయ్యాయి. తెలంగాణలో 8 జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చేవారం రోజులు తెలంగాణలో తీవ్ర వడగాలులు, పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Read also: Dead Boy Detectives OTT: ఓటీటీలో వచ్చేసిన థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగంటే?
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత 45.5 డిగ్రీలకు చేరుకుంది. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5 డిగ్రీలు, కడప జిల్లా ఖాజీపేటలో 45.3, పల్నాడు జిల్లా మాచర్లలో 45.2, కర్నూలు రూరల్లో 44.9, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.6, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా కొత్తవలసలో 44.2, మన్యం సాలూరులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 41 మండలాల్లో భారీ వర్షాలు, 116 మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 183 మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Read also: Ponguleti Srinivasa Reddy: ధరణి అనే దయ్యాన్ని సరిదిద్ధు తున్నాం..
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆనుకుని ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగుతుందని, వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రానున్న నెలలో మరింత వేడి గాలులు మరియు పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
B Vinod Kumar: కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్, వినోద్ కుమార్ మధ్యనే పోటీ..
తాజావార్తలు
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!