Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- నోటీసులు అందుకున్న ఓటర్లకు కీలక వెసులుబాటు
- కుటుంబంలోని వయోజన సభ్యుడితో వివరాల సమర్పణ
- ఫారం-6 దరఖాస్తులకు కొత్త నిబంధనలు
- అక్టోబర్ 1, 2026 అర్హత తేదీగా పరిగణన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana SIR : రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ , క్లెయిమ్ల పరిశీలన ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పరిష్కారం , కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం-6 దరఖాస్తులపై అధికారులు పాటించాల్సిన స్పష్టమైన మార్గదర్శకాలను ఆయన వెల్లడించారు.
ఓటర్లకు ఉపశమనం.. స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదు
ప్రత్యేక ప్రచార (SIR) ప్రక్రియలో భాగంగా వివిధ కారణాల వల్ల నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగతంగా అధికారుల ముందుకు హాజరు కావాల్సిన అవసరం లేదని సీఈఓ తెలిపారు. సదరు ఓటరు కుటుంబంలోని ఏదేని ఒక వయోజన కుటుంబ సభ్యుడు సంబంధిత ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ఎదుట హాజరై వివరాలు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. ఓటరు తరఫున కుటుంబ సభ్యులు సమర్పించిన అవసరమైన పత్రాలు, సమాచారాన్ని స్వీకరించి, ఆ నోటీసులను త్వరితగతిన పరిష్కరించాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు స్పష్టమైన సూచనలతో ఉత్తర్వులు పంపడం జరిగింది.
Also Read
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
ఫారం-6 దరఖాస్తుల పరిశీలన , డిక్లేరేషన్ ఫారం నిబంధనలు
నూతనంగా ఓటరు హక్కు కోసం దాఖలయ్యే ఫారం-6 దరఖాస్తుల పరిశీలన , క్లెయిమ్ల పరిష్కారంలోనూ నూతన నిబంధనలను పొందుపరిచారు. అర్హత కలిగిన ఓటరుగా గుర్తించడానికి 1 అక్టోబర్ 2026 ను ప్రధాన అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఫారం-6 దరఖాస్తులతో పాటు భవిష్యత్తులో అందే దరఖాస్తులకు కూడా ఈ నిబంధనలే వర్తిస్తాయి. రాబోయే రోజుల్లో సమర్పించే ప్రతి ఫారం-6 దరఖాస్తుతో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సీఈఓ ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అంతా భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన చట్టబద్ధమైన నిబంధనలకు కట్టుబడి పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!