Tahsildar Transfers : తెలంగాణలో 12 మంది తహశీల్దార్ల బదిలీ..
- రాష్ట్రవ్యాప్తంగా 12 మంది తహశీల్దార్ల బదిలీ
- డీఆర్ఓ, ఎస్డీసీ పోస్టుల్లో కొత్త నియామకాలు
- పరిపాలనా అవసరాలతో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వెంటనే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tahsildar Transfers : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనాపరమైన అవసరాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 12 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులకు తక్షణమే అమల్లోకి వచ్చేలా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లు (DRO) , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (SDC, Land Acquisition) గా కొత్త పోస్టింగులను కేటాయించారు. ఈ బదిలీలకు సంబంధించిన పూర్తి నివేదికను, అధికారులు విధుల్లో చేరిన వివరాలను ప్రభుత్వానికి తక్షణమే సమర్పించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) తో పాటు సంబంధిత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
Also Read
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయిన వారిలో నిర్మల్ తహశీల్దార్ మోతీరామ్ ఎ. ను మంచిర్యాల డీఆర్ఓగా, కరీంనగర్కు చెందిన బి. రాజేశ్వరిని పెద్దపల్లి డీఆర్ఓగా, పెద్దపల్లికి చెందిన కె.వై. ప్రసాద్ను జగిత్యాల డీఆర్ఓగా నియమించారు. అలాగే వనపర్తి నుంచి ఆర్. పాండును నాగర్కర్నూల్ డీఆర్ఓగా, ఖమ్మం నుంచి వి. రవికుమార్ను ములుగు డీఆర్ఓగా, మేడ్చల్-మల్కాజిగిరి నుంచి జె. స్వామిని కరీంనగర్ డీఆర్ఓగా, నాగర్కర్నూల్ నుంచి ఎ. పాండును కామారెడ్డి డీఆర్ఓగా బదిలీ చేశారు. వీరితో పాటు జనగామ తహశీల్దార్ సిహెచ్. శ్రీకాంత్ను మహబూబ్నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియమించగా, ఎం. సుదర్శన్ రెడ్డి (సూర్యాపేట) ను సిద్దిపేట ఎస్డీసీగా, ఎం. రమాదేవి (ఖమ్మం) ను నల్గొండ ఎస్డీసీగా, జి. కుమారస్వామి (పెద్దపల్లి) ను సిరిసిల్ల ఎస్డీసీగా , ఎన్. వెంకట్ రెడ్డి (కరీంనగర్) ను కరీంనగర్ ఎస్డీసీ (ఎల్ఏ) గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!