Rythu Bharosa: రైతు భరోసాపై కీలక ప్రకటన.. రైతుల అకౌంట్లో డబ్బులు జమ అప్పుడే..
- రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి వివేక్..
- మార్చి నెలాఖరు నుంచే నిధులు జమ..
- రూ.9 వేల కోట్లు అందజేస్తామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త .మార్చి నెల నుంచే రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ.. మొత్తం 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి వివరించారు.
Also Read
- Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం
- Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- Negligence : జహీరాబాద్ ఆస్పత్రిలో విషాదం.. వైద్యులు లేక శిశువు మృతి
దీనిని రెండు విడతల్లో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చి నెలాఖరులోగా రూ. 4,500 కోట్లు.. మిగిలిన నిధులను ఏప్రిల్ నెలలో జమ చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని.. సన్న వడ్లు పండించే 90 శాతం రైతులకు ప్రభుత్వం బోనస్ అందిస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐకేపీ (IKP), డీసీఎంఎస్ (DCMS) కేంద్రాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉందన్నారు.
Also Read:India LPG Supply: ముగిసిన LPG సంక్షోభం.. భారత్కు భారీ స్థాయిలో గ్యాస్..
గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ.. కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చారని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల స్థానిక రైతులు పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకా వెంకటస్వామి హయాంలోనే ప్రాణహిత ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా మహేశ్ ప్రసాద్ తివారీ, వైస్ చైర్మన్గా పాపిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గం రైతుల ప్రయోజనాల కోసం అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
తాజావార్తలు
-
Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
-
Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
-
Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
-
Celina Jaitly: పెళ్లి రోజు గిఫ్ట్ అంటూ విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్!
-
Vivo Y500: వివో Y500 విడుదల.. 50MP కెమెరా, 8100mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో కొత్త స్మార్ట్ఫోన్
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!