Komatireddy Venakt Reddy : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం
- తెలంగాణలో రూ.60.799 కోట్లతో రోడ్ల నిర్మాణం
- రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి రూ.36,000 వేల కోట్లు
- రూ.10,400 కోట్లతో హైదరాబాద్-విజయవాడ హైవే 8 లైన్లుగా విస్తరణ
- తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం
- రోడ్ల నిర్మాణంతో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. -మంత్రి కోమటిరెడ్డి
Komatireddy Venakt Reddy : తెలంగాణలో మౌలిక వసతుల రంగంలో ఎన్నడూ లేని భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ రహదారి ప్రాజెక్టులకు మొత్తం రూ.60,799 కోట్లు మంజూరు కావడం తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద రికార్డని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారుల ప్రధాన కేంద్రంగా మార్చే దిశగా రహదారి నిర్మాణాలు కీలకంగా నిలుస్తాయని కోమటిరెడ్డి చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షితమవుతాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు.
ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగా రూ.10,400 కోట్లతో హైదరాబాద్–విజయవాడ హైవేను ఎనిమిది లైన్లుగా విస్తరించనున్నారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రతిష్ఠాత్మక RRR ప్రాజెక్టుకు రూ.36,000 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు లేని చోట కొత్త రోడ్లు, సింగిల్ రోడ్లను డబుల్ లైన్లుగా మార్చే పనులు వేగవంతం చేయనున్నారు. HAM ప్రాజెక్ట్ కోసం రూ.11,399 కోట్లు ఖర్చు చేస్తామని, త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి వెల్లడించారు.
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
ఇవే కాకుండా మన్ననూరు-శ్రీశైలం మధ్య 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్కి రూ.8,000 కోట్లు కేటాయించారు. దేశంలోనే కొత్త గుర్తింపునిచ్చే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూ.20,000 కోట్లు ప్రతిపాదించారు. ఈ రహదారి పూర్తికాగానే తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి పద్దెనిమిది రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు. తమ రాజకీయ జీవితం లో ఇంత పెద్ద అవకాశం దక్కడం గర్వకారణమని, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
NPCIL Recruitment 2025: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో జాబ్స్.. మిస్ చేసుకోకండి
తాజావార్తలు
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
-
India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
-
Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
-
Ruturaj Gaikwad: ముంబైని ముంచిన చెన్నై వ్యూహం.. సీఎస్కే గెలుపు రహస్యం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
-
Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్తో గొడవ ఏంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!