Komatireddy Venakt Reddy : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం
- తెలంగాణలో రూ.60.799 కోట్లతో రోడ్ల నిర్మాణం
- రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి రూ.36,000 వేల కోట్లు
- రూ.10,400 కోట్లతో హైదరాబాద్-విజయవాడ హైవే 8 లైన్లుగా విస్తరణ
- తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం
- రోడ్ల నిర్మాణంతో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. -మంత్రి కోమటిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venakt Reddy : తెలంగాణలో మౌలిక వసతుల రంగంలో ఎన్నడూ లేని భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ రహదారి ప్రాజెక్టులకు మొత్తం రూ.60,799 కోట్లు మంజూరు కావడం తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద రికార్డని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారుల ప్రధాన కేంద్రంగా మార్చే దిశగా రహదారి నిర్మాణాలు కీలకంగా నిలుస్తాయని కోమటిరెడ్డి చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షితమవుతాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు.
ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగా రూ.10,400 కోట్లతో హైదరాబాద్–విజయవాడ హైవేను ఎనిమిది లైన్లుగా విస్తరించనున్నారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రతిష్ఠాత్మక RRR ప్రాజెక్టుకు రూ.36,000 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు లేని చోట కొత్త రోడ్లు, సింగిల్ రోడ్లను డబుల్ లైన్లుగా మార్చే పనులు వేగవంతం చేయనున్నారు. HAM ప్రాజెక్ట్ కోసం రూ.11,399 కోట్లు ఖర్చు చేస్తామని, త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి వెల్లడించారు.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
ఇవే కాకుండా మన్ననూరు-శ్రీశైలం మధ్య 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్కి రూ.8,000 కోట్లు కేటాయించారు. దేశంలోనే కొత్త గుర్తింపునిచ్చే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూ.20,000 కోట్లు ప్రతిపాదించారు. ఈ రహదారి పూర్తికాగానే తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి పద్దెనిమిది రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు. తమ రాజకీయ జీవితం లో ఇంత పెద్ద అవకాశం దక్కడం గర్వకారణమని, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
NPCIL Recruitment 2025: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో జాబ్స్.. మిస్ చేసుకోకండి
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!