Private Colleges : చర్చలు సఫలం.. రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్ విద్యాసంస్థలు
- డిప్యూటీ సీఎం భట్టితో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల చర్చలు సఫలం
- రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్ విద్యాసంస్థలు
- కాలేజీల యాజమాన్యాలు రూ.1500 కోట్లు అడిగాయి
- ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశాం
- మరో రూ.600 కోట్లు వెంటనే విడుదల చేస్తాం
- త్వరలో మరో రూ.300 కోట్లు విడుదల చేస్తాం. -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Private Colleges : తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు శుక్రవారం జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ప్రభుత్వ హామీతో సంతృప్తి చెందిన యాజమాన్యాలు తమ సమ్మెను విరమించుకోవడంతో, వేలాది మంది విద్యార్థులకు ఊరట లభించింది. దీనితో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు రేపటి నుంచి (శనివారం) తిరిగి తెరుచుకోనున్నాయి.
MS Dhoni: ధోని ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఐపీఎల్లో ఆడటంపై క్లారిటీ
Also Read
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్' ప్రారంభించనున్న సీఎం.!
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
యాజమాన్యాల ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమై, తమకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో సుమారు రూ. 1500 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ప్రస్తావించారు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న భట్టి విక్రమార్క, ప్రభుత్వం తరఫున కీలక హామీలతో సమస్యను సత్వరం పరిష్కరించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే రూ. 600 కోట్లు విడుదల చేసిందని తెలియజేశారు. అంతేకాకుండా, తక్షణమే మరో రూ. 600 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మిగిలిన రూ. 300 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ విధంగా, యాజమాన్యాలు కోరిన పూర్తి బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది.
బకాయిల చెల్లింపుతో ప్రస్తుత సమస్య పరిష్కారమైనప్పటికీ, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో భవిష్యత్తులో ఇలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి, సకాలంలో పారదర్శకంగా చెల్లింపులు జరిగేలా కొత్త మార్గదర్శకాలను సూచించడానికి త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని అమలు చేయనుంది.
తాజావార్తలు
-
ICC Women’s T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
-
Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
-
Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
-
Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభించనున్న సీఎం.!
-
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్లో మెస్సీ న్యూ వరల్డ్ రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఫుట్బాల్ ఆటగాడిగా హిస్టరీ
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!