Drugs : ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అయిన ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులు పట్టుబడుతూనే ఉన్నారు. ఇటీవలే బిజినెస్ మన్ లు వైద్యులు, ఇప్పుడు తాజాగా ఐ టి ఎంప్లాయిస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న సిటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులకు పట్టుబడ్డారు. డ్రగ్స్ కేసులో ఎవరి ప్రమేయం ఉన ఎంతటి వారినైనా వదిలేది లేదని నగర పోలీస్ బాస్ హెచ్చరించారు
నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విసిరిన వలలో ఈ సారి డ్రగ్స్ సేవిస్తూ డ్రగ్స్ విక్రయస్తు ఐ టీ ఎంప్లాయిస్ తో పాటు హైదరాబద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పట్టుబడ్డారు. ప్రధానంగా డార్క్నెట్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుందన్న విషయాన్ని గుర్తించిన నార్కోటిక్ అధికారులు.. ఎట్టకేలకు మూడు గ్యాంగ్లను అరెస్ట్ చేశారు. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులకు పట్టుబడిన వారిలో విద్యార్థులు, ఐ టి సెక్టార్ లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారే అధికంగా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
హైదరాబాద్లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న మూడు ముఠాలను నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు. డార్క్నెట్లో నిఘా పెట్టిన నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్. అరెస్ట్ చేసిన వారిలో. నిందితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పీజీ, ఇంజినీరింగ్ బి టెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఇదివరకు మానవీయ కోణంలో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టిన పోలీసులు ఈ సారి ఈ కేసులో ప్రమేయం ఉన్న 11 మందిని అరెస్ట్ చేశారు అందులో 7గురు స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కేసులో ఓ విద్యార్థిని పరారీలో ఉంది.
డార్క్నెట్ ద్వారా వినియోగదారులు డ్రగ్స్ తెప్పిచుకుంటూ పట్టుబడకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఎల్ఎస్డీ మాదకద్రవ్యాలను వాడుతున్నట్లు పోలీసులు గుర్తించరు. వీటిని పోస్టు, కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు స్టూడెంట్స్. పట్టుబడిన ముఠాలో నైజీరియన్ దేశస్తుడు ఉన్నాడు. ఆ దేశస్థులు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పరిశీలనలో తేలిందని వెల్లడించారు నగర సిపి. వీసా గడువు ముగిసిన ముంబాయి లో ఉంటున్నారని.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని నగర సిపి ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ తీసుకునే వాళ్లు కార్పొరేట్ కంపెనీలో మంచి స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయ విశ్వ విద్యాలయాల్లో కొంత మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారని.. ఆయా యూనివర్శిటీల దృష్టికి తీసుకెళ్లామని సిపి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!