విజయ కిన్నెర వాటర్ ను నెలక్రిందట మార్కెట్లోకి ప్రవేశపెట్టినం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కాబట్టి 23 విజయ ఆహార ఉత్పత్తులతోనే ఆగిపోము. వంద వస్తువులు భవిష్యత్ లో తీసుకువస్తాం అని తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇంకా విజయ పచ్చళ్ళు, తినుబండారాలు కూడా తీసుకువస్తాం. విజయ ఉత్పత్తులతో వంట గదిని నింపేలా ముందుకు సాగుతాం అని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. ప్రైవేటు నుంచి పోటీ తట్టుకోవాలంటే నాణ్యత, నమ్మకం ముఖ్యం అని సూచించారు. అలాగే తెలంగాణలో విజయ ఆయిల్స్ కు ఆదరణ ఎక్కువగా ఉంది కాబట్టే ప్రైవేటు ఆయిల్ కంపెనీలు అదుపులో ఉండి పని చేస్తున్నాయి అని పేర్కొన్నారు.