Telangana new secretariat inauguration: నేడే డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభం
Telangana secretariat inauguration: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీహోమంలో పాల్గొన్నారు. 110 మంది వేదాంతులు, రుత్విక్కులు సచివాలయంలో హోమం, యాగ నిర్వహణ, వివిధ ఛాంబర్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. శృంగేరి పీఠానికి చెందిన గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ, వాస్తు పండిట్ సుద్దాల సుధాకర తేజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
Read also: China Birth Rate: పెళ్లికాకున్నా ఫర్వాలేదు.. పిల్లలు పుట్టడం కావాలి
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకుంటారు. నేరుగా హోమశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొంటారు. అనంతరం మహాద్వారం వద్ద శిలా ఫలకాన్ని ఆవిష్కరించి కొత్త సచివాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం కింది అంతస్తులో వాస్తు పూజలో సీఎం పాల్గొంటారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ తెరవనుండగా, మంత్రులందరూ తమ తమ కార్యాలయాలను ఒకేసారి తెరవనున్నారు. ఆయా శాఖల కార్యాలయాల్లోనూ అధికారులు కూర్చోనున్నారు. మధ్యాహ్నం 1:20 నుంచి 1:32 గంటల మధ్య పూర్ణాహుతి నిర్వహించి, అనంతరం ఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత ఆరో అంతస్తులోని తన ఛాంబర్లో కూర్చుని ఫైల్పై సంతకం చేయనున్నారు. మంత్రులందరూ మధ్యాహ్నం 1:56 నుండి 2:40 గంటల మధ్య తమ తమ కార్యాలయాల్లో కూర్చుంటారు. సరిగ్గా మధ్యాహ్నం 2:15 నుంచి 2:45 గంటల మధ్య సచివాలయ ఉద్యోగులు, మంత్రులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రత్యేక భోజన ఏర్పాట్లు కూడా చేశారు.
Read also: Muskan Narang: ఇదే నా చివరి వీడియో అంటూ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయం రాష్ట్ర పరిపాలనా అవసరాలకు సరిపోకపోవడంతో ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. 2020 నవంబర్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ‘షాపూర్జీ-పల్లోంజీ’తో ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయ నిర్మాణ పనులు 4 జనవరి 2021న ప్రారంభమయ్యాయి. రికార్డు స్థాయిలో 26 నెలల కాలంలో 10 లక్షల 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతమైన సచివాలయ భవనాన్ని నిర్మించారు. ఇంత త్వరగా పూర్తి చేసిన ప్రభుత్వ భవనం దేశంలో మరొకటి లేదు. కరోనా వంటి విపత్తు సమయంలో కూడా, పని నిరాటంకంగా కొనసాగింది.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!