KTR: కేసీఆర్ పథకాలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ న్నాయకత్వంలో తెలంగాణలో చిరస్మరణీయంగా కొన్ని పథకాలు నిలిచిపోయాయి అని ప్రశంసలు కురిపించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మల్కాపేటలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చల్మెడ జానకి దేవి స్మారకార్థం సుమారు రూ. 2 కోట్లతో నిర్మించిన పాఠశాల భవనాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. విపక్షాలపై విరుచుకుపడుతూనే రాష్ట్రంలో అమలు అవుతోన్న సంక్షేమ పథకాలను వివరించారు.
Read Also: Etela Rajender: కేసీఆర్కి క్షణం కూడా సీఎంగా కొనసాగే అర్హత లేదు..!
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
దేశంలోనే తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అని తెలిపారు మంత్రి కేటీఆర్.. రైతు బంధు, రైతు భీమా అందిస్తున్నాం.. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పని ఇంటికీకి నల్లా నీరు ఇస్తున్నాం అన్నారు. ప్రతి పేదవాడికి రూ.2000 పెనన్స్ ఇస్తున్నాం, మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 7300 పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో మొట్ట మొదటి పాఠశాల మల్కాపేట పాఠశాల కావడం విశేషం అన్నారు. ఇక, 4 లక్షల మందికి పైగా జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ చేశాం.. పేద వాడికి విద్య వైద్యం ముఖ్యం.. ఆ ఆదిశగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. మా నాయనమ్మ ఊరు కామారెడ్డి దగ్గరలో సొంతంగా నిర్మిస్తున్నాం.. అలాగే, మా అమ్మమ్మ ఊరు కోదురుపాకలో నిర్మిస్తాను అని ప్రకటించారు కేటీఆర్.
ఇక, రాష్ట్రంలోనే విద్య వైద్యలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉండాలని ఆకాక్షించారు మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో విద్య కోసం సర్కార్ పెద్ద పీట వేస్తుందన్న ఆయన.. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నెలకొల్పి లక్షల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాం అన్నారు. తెలంగాణ వస్తే ఏమి వస్తుంది? అన్నారు.. తెలంగాణ వస్తే నీళ్లు వచ్చాయని తెలిపారు. పక్కనే ఉంది మల్కాపేట రిజర్వాయర్.. పూర్తి కాగానే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం.. ముంపు గ్రామాల సమస్యలను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు మంత్రి కేటీఆర్.
తాజావార్తలు
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!