కరెంట్ ఛార్జీల మోతకు రంగం సిద్ధం.. ఇలా పెరుగుతాయి..!
తెలంగాణలో చార్జీల పెంపుపై కసరత్తు చేస్తున్న విద్యుత్ అధికారులు ప్రజలపై భారం పడకుండా లాభం పొందడానికి గల మార్గాలను అన్వేషిష్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా పెంచని ప్రాథమిక చార్జీల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. LT 1-A కేటగిరీలో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే యూనిట్కు రూపాయి 45 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. మొదటి నుంచి ఈ చార్జీల్లో మార్పు లేదు. ఈ సారి స్వల్పంగా పెంచి దానిని రూపాయిన్నరగా రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలున్నాయి. అంటే, యూనిట్కు 5 పైసలు పెంచడం వల్ల నెల బిల్లులో కేవలం 3 రూపాయలు మాత్రమే పెరుగుతుందంటున్నారు అధికారులు. ఇది వినియోగదారులకు పెద్ద భారమేమీ కాదంటున్నారు. అలాగే, స్లాబుల సరళతరంపైనా ఫోకస్ పెట్టారు.
స్లాబుల్లో మార్పు, డిమాండ్ చార్జీల పెంపుతో పరోక్ష ఆదాయం పెరగవచ్చని భావిస్తున్నాయి డిస్కమ్లు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే పారిశ్రామిక విద్యుత్ చార్జీలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏపీ చార్జీలకు సమానంగా ఉండేలా పారిశ్రామిక చార్జీలు తగ్గించే అవకాశం ఉంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల మేరకు సబ్సిడీలు సకాలంలో అందజేయడం లేదు. దీనికి తోడు 9 గంటల వ్యవసాయ విద్యుత్ కాస్తా 24 గంటలకు పెరిగింది. వ్యవసాయ విద్యుత్కు సరైన లెక్కలు లేవు. ఇది చాలదన్నట్టు ఉద్యోగులకు పదోన్నతులు, కొత్త పోస్టుల భర్తీ కారణంగా విద్యుత్ సంస్థలపై వేతన భారం పెరిగింది. ఇప్పుడు ఈ మొత్తం భారాన్ని వినియోగదారులకు మళ్లించే పనిలో ఉంది ప్రభుత్వం. అయితే, నేరుగా చార్జీల మోపకుండా… ఆదాయం ఎలా పెంచుకోవాలనే దానిపై భారీ కసరత్తే చేస్తోంది. మరోవైపు.. విద్యుత్ చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలను ఖండిస్తున్నాయి ప్రతిపక్షాలు. జనంపై భారం మోపితే సహించబోమంటున్నాయి. గత ఏడేళ్లలో కరెంట్ ఛార్జీలు పెరగలేదు. కానీ… ఇప్పుడు చార్జీల పెంపు అనివార్యమని తెలుస్తోంది. ప్రస్తుతం డిస్కమ్స్ వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు… ప్రభుత్వం సబ్సిడీల భారం ప్రతీ సంవత్సరం పెంచుకుంటూ పోతోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తే ఛార్జీల పెంపు ఉండదు. లేదంటే వచ్చే ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల భారం తప్పకపోవచ్చు. అయితే, దీనిపై సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
- BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
తాజావార్తలు
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!