LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
- ఎల్ఆర్ఎస్ ఫీజుపై 25% భారీ రాయితీ
- మే 1 నుంచి జూలై 31 వరకు అవకాశం
- పెండింగ్ లేఅవుట్ల పరిష్కారానికి చర్యలు
- తక్కువ ఖర్చుతో భూములకు చట్టబద్ధత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో అనుమతి లేని మరియు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (Layout Regularization Scheme) కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్లో ఉన్న లేఅవుట్ల క్రమబద్ధీకరణను వేగవంతం చేసే ఉద్దేశంతో, ఎల్ఆర్ఎస్ ఫీజు మరియు ఇతర చార్జీలపై ఏకంగా 25 శాతం రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ (MA&UD) బుధవారం నాడు ఈ మేరకు జీఓ ఎంఎస్ నెం. 131ని విడుదల చేసింది. ఈ రాయితీ పథకం మే 1, 2026 నుంచి జూలై 31, 2026 వరకు మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ గడువు లోపు తమ ఎల్ఆర్ఎస్ చార్జీలను చెల్లించే దరఖాస్తుదారులకు మాత్రమే ఈ 25% డిస్కౌంట్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేయడంలో ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం. రాయితీ ప్రకటించడం ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్లాట్లను/లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అప్రూవ్డ్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్ రూల్స్-2020 కు సవరణలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ ఉత్తర్వులను జారీ చేస్తూ, తదుపరి చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్, హెచ్ఎండిఏ (HMDA) మెట్రోపాలిటన్ కమిషనర్, మరియు పంచాయతీ రాజ్ కమిషనర్ సహా సంబంధిత అధికారులందరినీ ఆదేశించారు.
దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న అక్రమ లేఅవుట్ల సమస్యకు ఈ రాయితీ ద్వారా పరిష్కారం లభిస్తుందని, తక్కువ ధరకే తమ భూములను చట్టబద్ధం చేసుకునే సువర్ణావకాశం ప్రజలకు దక్కిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
-
Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?