కోకాపేట్, ఖానామెట్ భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది.. కనక వర్షమే కురిసింది.. అయితే, ఖానామెట్ భూముల వేలంపై కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.. ఖానామెట్లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఖనామెట్లో గొల్డెన్ మైల్లోని 15 ఎకరాలను వేలం వేశారు.. అయితే, 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం కూడా ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టగా.. ఆ స్మశానవాటిక వేలాన్ని ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారు స్థానికులు… తమ పూర్వికుల సమాధులు అక్కడే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. తాము సెంటిమెంట్గా భావించే సమాధులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.. దీంతో తాత్కలికంగా స్మశాన వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. కాగా, నిన్న జరిగిన ఈ భూముల వేలంలో ప్రభుత్వానికి దాదాపు రూ.730 కోట్ల ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే.