High Court Telangana : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

  • ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి
  • తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
  • ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై షెడ్యూల్‌ ఖరారు చేయాలని గతంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పు
  • సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసిన అసెంబ్లీ కార్యదర్శి
Tg High Court

Tg High Court

High Court Telangana : తెలంగాణలో పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత విధించేందుకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం వాదనలు విని తీర్పును రిజర్వు చేసింది. ఈ సందర్భంగా, బీఆర్‌ఎస్‌ (BRS) తరఫున సీనియర్ న్యాయవాది మోహన్‌రావు వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీల్‌ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు.

Marco Rubio: భారత మద్దతుదారుడే అమెరికా విదేశాంగ కార్యదర్శి.. ట్రంప్ కీలక ఎంపిక..!

×
×
Ad

అసెంబ్లీ స్పీకర్‌ పక్షాన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. అలాగే, అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణ అర్హత లేదు అనే వాదనను కూడా హైకోర్టుల న్యాయమూర్తి ముందుకు పెట్టారు. ఇప్పటికే, ఈ కేసు పై సింగిల్ జడ్జి తీర్పు వచ్చిన నేపధ్యంలో, స్పీకర్‌కు అనర్హత పిటిషన్లపై సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నట్లు సూచించబడింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం, మరింత విచారణ చేపట్టకుండా తీర్పును రిజర్వు చేసింది.

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్