Damodara Raja Narasimha : వైద్య సేవల పరంగా ప్రభుత్వం వేగంగా ముందడుగు.. అత్యాధునిక యంత్రాలు, ఫర్నీచర్ కొనుగోలు..
- టిమ్స్, వరంగల్ హాస్పిటళ్లకు అత్యాధునిక పరికరాల ఖరీదుకు ఆదేశం
- మెడిసిన్ స్టోర్లలో మూడు నెలల స్టాక్ నిల్వ చేయాలని సూచన
- ప్రతి పీహెచ్సీలో శాంపిళ్ల సేకరణ, 24 గంటల్లో రిపోర్టులు తప్పనిసరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodara Raja Narasimha : తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంపై మరింత దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్తగా నిర్మితమవుతున్న టిమ్స్ హాస్పిటల్స్తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్, ఫర్నీచర్ కొనుగోలుకు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- KTR: "23 లక్షల మందికి మానసిక క్షోభ".. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
- Telangana Liquor Shop Scam: "పేరు దళితులది.. దందా సిండికేట్లది".. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
సోమవారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు. పేషెంట్లు అధిక సంఖ్యలో వచ్చే నేపథ్యంలో, వారి అవసరాలకు తగ్గట్లుగా ఫర్నీచర్, మెడికల్ పరికరాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్న తరుణంలో, పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, మెడిసిన్ నిల్వలు ముందుగానే సిద్ధంగా ఉంచాలని మంత్రి అధికారులకు స్పష్టంగా చెప్పారు. కనీసం మూడు నెలలకు సరిపడా మందులు సెంట్రల్ మెడిసినల్ స్టోర్లలో నిల్వ ఉండేలా చూడాలని టీజీఎంఎస్ఐడీసీ అధికారులకు సూచించారు.
Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు కేరళ సర్కార్ రాచమర్యాదలు.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి!
ప్రతి పీహెచ్సీలో పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించి, 24 గంటల్లోగా రిపోర్టులు అందించే విధంగా టెస్టింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఒక్కో పరీక్ష కోసం పేషెంట్లు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు. డయాగ్నస్టిక్స్ హబ్లలో అన్నిరకాల టెస్టులు, స్కాన్ల సౌకర్యం అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతి మెడికల్ కాలేజీలో సీటీ స్కాన్ యంత్రాలు ఇప్పటికే అందుబాటులోకి తీసుకురాగలిగామని, ఇప్పుడు ఎంఆర్ఐ యంత్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. వీటి కొనుగోలు, ఇన్స్టాలేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో మెడిసినల్ స్టోర్లను ఏర్పాటు చేశామని, వాటికి శాశ్వత భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించామని మంత్రి వెల్లడించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Quantum Valley Declaration: క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు ఆమోదం.. ప్రభుత్వం ఉత్తర్వులు
తాజావార్తలు
-
Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
-
Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
-
Anil Kochhar: అమెరికా యూనివర్శిటీలో సంచలనం.. 176 మంది స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేసిన ఇండియన్! ఆయన ఎవరో తెలుసా..
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
ట్రెండింగ్
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!