Damodara Raja Narasimha : వైద్య సేవల పరంగా ప్రభుత్వం వేగంగా ముందడుగు.. అత్యాధునిక యంత్రాలు, ఫర్నీచర్ కొనుగోలు..
- టిమ్స్, వరంగల్ హాస్పిటళ్లకు అత్యాధునిక పరికరాల ఖరీదుకు ఆదేశం
- మెడిసిన్ స్టోర్లలో మూడు నెలల స్టాక్ నిల్వ చేయాలని సూచన
- ప్రతి పీహెచ్సీలో శాంపిళ్ల సేకరణ, 24 గంటల్లో రిపోర్టులు తప్పనిసరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodara Raja Narasimha : తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంపై మరింత దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్తగా నిర్మితమవుతున్న టిమ్స్ హాస్పిటల్స్తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్, ఫర్నీచర్ కొనుగోలుకు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
సోమవారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు. పేషెంట్లు అధిక సంఖ్యలో వచ్చే నేపథ్యంలో, వారి అవసరాలకు తగ్గట్లుగా ఫర్నీచర్, మెడికల్ పరికరాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్న తరుణంలో, పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, మెడిసిన్ నిల్వలు ముందుగానే సిద్ధంగా ఉంచాలని మంత్రి అధికారులకు స్పష్టంగా చెప్పారు. కనీసం మూడు నెలలకు సరిపడా మందులు సెంట్రల్ మెడిసినల్ స్టోర్లలో నిల్వ ఉండేలా చూడాలని టీజీఎంఎస్ఐడీసీ అధికారులకు సూచించారు.
Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు కేరళ సర్కార్ రాచమర్యాదలు.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి!
ప్రతి పీహెచ్సీలో పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించి, 24 గంటల్లోగా రిపోర్టులు అందించే విధంగా టెస్టింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఒక్కో పరీక్ష కోసం పేషెంట్లు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు. డయాగ్నస్టిక్స్ హబ్లలో అన్నిరకాల టెస్టులు, స్కాన్ల సౌకర్యం అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతి మెడికల్ కాలేజీలో సీటీ స్కాన్ యంత్రాలు ఇప్పటికే అందుబాటులోకి తీసుకురాగలిగామని, ఇప్పుడు ఎంఆర్ఐ యంత్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. వీటి కొనుగోలు, ఇన్స్టాలేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో మెడిసినల్ స్టోర్లను ఏర్పాటు చేశామని, వాటికి శాశ్వత భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించామని మంత్రి వెల్లడించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Quantum Valley Declaration: క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు ఆమోదం.. ప్రభుత్వం ఉత్తర్వులు
తాజావార్తలు
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!