Damodara Raja Narasimha : వైద్య సేవల పరంగా ప్రభుత్వం వేగంగా ముందడుగు.. అత్యాధునిక యంత్రాలు, ఫర్నీచర్ కొనుగోలు..
- టిమ్స్, వరంగల్ హాస్పిటళ్లకు అత్యాధునిక పరికరాల ఖరీదుకు ఆదేశం
- మెడిసిన్ స్టోర్లలో మూడు నెలల స్టాక్ నిల్వ చేయాలని సూచన
- ప్రతి పీహెచ్సీలో శాంపిళ్ల సేకరణ, 24 గంటల్లో రిపోర్టులు తప్పనిసరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodara Raja Narasimha : తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంపై మరింత దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్తగా నిర్మితమవుతున్న టిమ్స్ హాస్పిటల్స్తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్, ఫర్నీచర్ కొనుగోలుకు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
సోమవారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు. పేషెంట్లు అధిక సంఖ్యలో వచ్చే నేపథ్యంలో, వారి అవసరాలకు తగ్గట్లుగా ఫర్నీచర్, మెడికల్ పరికరాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్న తరుణంలో, పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, మెడిసిన్ నిల్వలు ముందుగానే సిద్ధంగా ఉంచాలని మంత్రి అధికారులకు స్పష్టంగా చెప్పారు. కనీసం మూడు నెలలకు సరిపడా మందులు సెంట్రల్ మెడిసినల్ స్టోర్లలో నిల్వ ఉండేలా చూడాలని టీజీఎంఎస్ఐడీసీ అధికారులకు సూచించారు.
Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు కేరళ సర్కార్ రాచమర్యాదలు.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి!
ప్రతి పీహెచ్సీలో పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించి, 24 గంటల్లోగా రిపోర్టులు అందించే విధంగా టెస్టింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఒక్కో పరీక్ష కోసం పేషెంట్లు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు. డయాగ్నస్టిక్స్ హబ్లలో అన్నిరకాల టెస్టులు, స్కాన్ల సౌకర్యం అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతి మెడికల్ కాలేజీలో సీటీ స్కాన్ యంత్రాలు ఇప్పటికే అందుబాటులోకి తీసుకురాగలిగామని, ఇప్పుడు ఎంఆర్ఐ యంత్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. వీటి కొనుగోలు, ఇన్స్టాలేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో మెడిసినల్ స్టోర్లను ఏర్పాటు చేశామని, వాటికి శాశ్వత భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించామని మంత్రి వెల్లడించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Quantum Valley Declaration: క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు ఆమోదం.. ప్రభుత్వం ఉత్తర్వులు
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!