Group1 : గ్రూప్-1 తీర్పుపై హైకోర్టులో మరోసారి అప్పీల్ దాఖలు
- HYD: గ్రూప్-1 తీర్పుపై హైకోర్టులో మరోసారి అప్పీల్ దాఖలు
- జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు తీర్పు కొట్టివేయాలని పిటిషన్
- గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి పిటిషన్ను స్వీకరించిన సీజే ధర్మాసనం
- TGPSC కూడా పిటిషన్ దాఖలు చేసిందన్న పిటిషనర్
- రెండు పిటిషన్లు కలిపి విచారణ చేస్తామన్న హైకోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group1 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించిన గ్రూప్-1 నియామకాలపై కొనసాగుతున్న వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీలు చేసిన నేపథ్యంలో, తాజాగా గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
మార్చి 10న విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు, ఈ నెల 9న కీలక తీర్పు ఇచ్చారు. ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు, మార్కుల జాబితాను రద్దు చేశారు. ఈ తీర్పుతో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది.
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ వాదనలను సరైన రీతిలో పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంటూ డివిజన్ బెంచ్లో అప్పీలు చేసింది. ఫలితాలు సక్రమంగానే ఉన్నాయని, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలులోకి వస్తే నియామక ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని టీజీపీఎస్సీ వాదిస్తోంది.
తాజాగా, గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి కూడా సింగిల్ బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ అప్పీల్ దాఖలు చేశారు. తన నియామకం చట్టబద్ధమని, ఇప్పటికే పొందిన హక్కును కోర్టు తీర్పుతో రద్దు చేయరాదని పిటిషనర్ వాదించారు. ఈ పిటిషన్ను సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
ఒకవైపు టీజీపీఎస్సీ, మరోవైపు ఎంపికైన అభ్యర్థి చేసిన అప్పీల్స్తో గ్రూప్-1 వివాదం మరింత క్లిష్టంగా మారింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఏ తీర్పు ఇస్తుందో అన్నది రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులలో ఆసక్తిని రేపుతోంది. ఈ కేసు తుది పరిష్కారం వచ్చేంతవరకు నియామకాలు నిలిచిపోవడం ఖాయమని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
Italy: ఇటలీలో పాలస్తీనా ప్రకంపనలు.. హింసాత్మకంగా మారిన నిరసనలు
తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?