New Secretariat Security: కొత్త సచివాలయంలోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Secretariat Security: తెలంగాణ కొత్త సచివాలయ భవనం అన్ని హంగులతో రూపుదిద్దుకుంది! ముఖ్యంగా భద్రత దృష్ట్యా, ఇది సురక్షితమైన స్వర్గధామం! శత్రువు అందుకోలేని కట్టడం! చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా భద్రత వలయం! డేగ కళ్లతో ఆహారం కాస్తుంటాయి. సచివాలయ భద్రత కోసం ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ క్షణాల్లో సెక్యూరిటీ గార్డుల కంప్యూటర్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. ఆ సెక్యూరిటీ లైన్ దాటిన తర్వాతే ఎవరైనా సచివాలయంలోకి ప్రవేశించగలరు. 650 మందికి పైగా భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో నిత్యం పహారా కాస్తారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పటిష్టమైన సీసీటీవీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సందర్శకులు ఫేస్ రికగ్నిషన్ ద్వారా తమ సమాచారాన్ని ఆధార్ డేటాకు లింక్ చేస్తారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో భద్రపరిచిన డేటా ద్వారా సందర్శకుల పూర్తి వివరాలు తక్షణమే కంప్యూటర్ స్క్రీన్పై ప్రదర్శించబడతాయి.
Read also: Astrology: ఏప్రిల్ 30, ఆదివారం దినఫలాలు
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకుంటారు. నేరుగా హోమశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొంటారు. అనంతరం మహాద్వారం వద్ద శిలా ఫలకాన్ని ఆవిష్కరించి కొత్త సచివాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం కింది అంతస్తులో వాస్తు పూజలో సీఎం పాల్గొంటారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ తెరవనుండగా, మంత్రులందరూ తమ తమ కార్యాలయాలను ఒకేసారి తెరవనున్నారు. ఆయా శాఖల కార్యాలయాల్లోనూ అధికారులు కూర్చోనున్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు. సీఎం కార్యాలయం పూర్తిగా తెల్లటి మార్బుల్తో, సిబ్బంది కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రజలతో మమేకమై ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ‘జనహిత’ పేరుతో కనీసం 250 మంది కూర్చునేలా సభాస్థలిని ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేలా క్యాబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించేందుకు 60 మందికి ఒక హాలు, 50 మందికి మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో భోజనం చేసేందుకు దాదాపు 25 మంది కూర్చునేలా అత్యాధునిక భోజనశాలను ఏర్పాటు చేశారు.
Telangana new secretariat inauguration: నేడే డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభం
తాజావార్తలు
-
Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
-
Upcoming Smartphones: హువావే, లావా, షియోమి, మోటరోలా నుంచి.. జూన్ మొదటి వారంలో విడుదలయ్యే 5G స్మార్ట్ఫోన్స్ ఇవే
-
Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్కు మమత వార్నింగ్..
-
IPL Final 2026: ఆ గ్రౌండ్లో అడుగుపెడితే శివాలెత్తిపోతాడు.. RCB గ్యాంగ్ను భయపెడుతున్న గిల్ రికార్డులు!
-
Karuppu : కరుప్పు’ బ్లాక్బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు ‘సూర్య’ ఖరీదైన గిఫ్ట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..