ప్రపంచ పర్యావరణ దినోత్సవం : మొక్కలు నాటిన గవర్నర్ తమిళ సై దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం చేపట్టి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి రాజ్ భవన్ లోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ గారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని యువకుడు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని అన్నారు. సందర్భం ఏదైనా మొక్కలు నాటాలని పిలుపునివ్వడం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుందని అన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలు నాటాలని పిలుపునివ్వడంతో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సంతోష్ కుమార్ గారితో కలిసి మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఇదే విధంగా ముందుకు కొనసాగాలని వారికి తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని గవర్నర్ గారు అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!