Telangana Floods : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Floods at Bhadradri Kothagudem Updates.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు తగ్గుతూ వస్తుంది నిన్న రాత్రి తగ్గిన గోదావరి మళ్లీ పెరిగి తగ్గడం ప్రారంభించింది. మూడు రోజుల క్రితం 71.3 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం ఆ తర్వాత క్రమేపి తగ్గుతూవస్తోంది. 1986లో అత్యధికంగా 75.6 అడుగులకు చేరుకోగా 1990లో 70 అడుగులకు చేరుకుంది. ఆ తర్వాత ఈ స్థాయికి మళ్లీ ఇప్పుడే మొదటిసారి గోదావరి పెరిగింది . నిన్న రాత్రి గోదావరి దోబూచులాట ఆడింది. నిన్న రాత్రి వరకు తగ్గి మళ్లీ గోదావరి పర్యాటక ప్రాంతంలో వరదలు వర్షాలు బాగా రావడంతో పాటు మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి కూడా 12 లక్షల పైగా విడుదల చేశారు. దీంతో మళ్లీ కొంతమేరకు గోదావరికి వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గత రాత్రి ఏడు పాయింట్లు అంటే ఒక అడుగు లోపే పెరిగింది. ఆ తర్వాత మళ్లీ తగ్గడం ప్రారంభించింది ప్రస్తుతం భద్రాచలం గోదావరి నీటిమట్టం 55.8 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది మరింత తగ్గితే మరో రెండు అడుగులు తగ్గితే మూడవ ప్రమాద హెచ్చరికను తొలగిస్తారు. 48 అడుగులకి తగ్గితే రెండో ప్రమాద హెచ్చరిక, 43 అడుగుల వరకు తగ్గితే మొదటి ప్రపంచ హెచ్చరిక ఉపసంహరిస్తారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గిపోవటంతో గోదావరి ప్రాంతంలో వరదలు కూడా తగ్గుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వల్ల అన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ భద్రాచలం రెవిన్యూ డివిజన్ పరిధిలోని చర్ల దుమ్ముగూడెం బూర్గంపాడు అశ్వాపురం మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
ఇప్పటివరకు జాతీయ రహదారిపై ఇంకా నీళ్లు వల్ల రవాణాకి ఆటంకం గానే ఉంది . వరదలు వస్తాయని తెలిసినప్పటికీ ముందస్తుగా సహాయ చర్యలను తీసుకోవడాం లో ప్లాన్ చేయడం అంచనాలు వేయడంలో అధికారులు విఫలమయ్యారు. వరదల వల్ల సహాయ చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చివరికి నిత్యవసర వస్తువుల సరఫరాకి ఆర్మీ హెలికాప్టర్ రావాల్సి వచ్చింది. గతంలో ముందుగానే లాంచీలను సిద్ధం చేసుకునే వారు ప్రస్తుతం అటువంటి మందస్తు చర్యలకు గత అధికారులు స్వస్తి పలికారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇక్కడ గురయ్యారు. కాగా భద్రాచలం వద్ద రామాలయం పక్కనే స్లూయిజ్ లీకేజీ వల్ల రామాలయం చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలో నీళ్లు వచ్చి చేరాయి దీంతో ఈ ప్రాంతంలో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు అధికారల వైఖరి పట్ల దుమ్మెత్తి పోస్తున్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!