Telangana: ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్లు విడుదల.. సిలబస్పై లేని స్పష్టత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎంసెట్-2022, ఈసెట్-2022 ప్రవేశపరీక్షలకు నోటిఫికేషన్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంసెట్ కోసం ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష.. జూలై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన చేసింది. ఎంసెట్ పరీక్ష కోసం దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు అయితే రూ.800.. ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.400 చెల్లించాల్సి ఉంది.
మరోవైపు ఈసెట్ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి జూన్ 8 వరకు అధికారులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 13న ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్, డిప్లొమా, బీఎస్సీ మేథమేటిక్స్ చదివిన విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ను నిర్వహిస్తారు. ఈసెట్ పరీక్ష కోసం జనరల్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలని ఈసెట్ కన్వీనర్ విజయ్ కుమార్ తెలిపారు.
Also Read
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
కాగా ఎంసెట్ను ఏపీ, తెలంగాణలో 105 కేంద్రాల్లో నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి వెల్లడించారు. తెలంగాణ ఎంసెట్కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 2.5 లక్షల మంది దరఖాస్తు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,64 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల కోసం 86,644 మంది దరఖాస్తు చేశారు. ఈ ఏడాది కూడా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ప్రభుత్వం కనీస మార్కులతో పాస్ చేయడంతో భారీగానే దరఖాస్తులు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఎంసెట్లో వెయిటేజ్, ఇంటర్లో మినిమం మార్క్స్, ఎంసెట్ సిలబస్పై అధికారికంగా ఇప్పటివరకు ఉత్తర్వులు వెలువడలేదు. వీటిపై క్లారిటీ లేకుండానే ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఈసారి కూడా ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ ఉండదని తెలుస్తోంది. ఇంటర్ పాస్ అయితే చాలు అని.. మొదటి, ద్వితీయ సంవత్సరం 70 శాతం సిలబస్ నుండే ప్రశ్నలు ఉంటాయని ఉన్నత విద్యా మండలి అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!