Power Charges: మళ్లీ విద్యుత్ చార్జీల మోత..! తెలంగాణ ఈఆర్సీకి ప్రతిపాదనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మరోసారి విద్యుత్ చార్జీల మోత మోగనుందా? అంటే ఏమో అది జరిగినా ఆశ్చర్యం మాత్రం లేదు.. ఎందుకంటే.. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తెలంగాణ ఈఆర్సీ ఛైర్మెన్ శ్రీరంగ రావుకు సమర్పించాయి డిస్కంలు.. ఇక, తనకు అందిన ప్రతిపాదలనపై తెలంగాణ ఈఆర్సీ ఛైర్మెన్ శ్రీరంగరావు మాట్లాడుతూ.. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి అందించాయి.. ఈ వివరాలన్నీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో పెడతాం అన్నారు.. డిస్కమ్స్ ప్రతిపాదనలపై బహిరంగ ద్వారా అభిప్రాయాలు తీసుకుంటాం.. పబ్లిక్ సమావేశాల తర్వాత ఛార్జీలు పెంచాలా? తగ్గించాలా? అనేది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.. ఇక, 500 యూనిట్లు వినియోగించే వినియోగదరులకు ప్రీ పెయిడ్ మీటర్స్ పెట్టుకోవాలని డిస్కంలు సూచించాయన్న ఆయన.. యూనిట్కు 30 పైసలు డిస్కంలు పెంచుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.. ఇప్పటి వరకు డిస్కంలు వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం డిస్కంలకు ఇచ్చే నిధులను సకాలంలో అందజేస్తాయని వారి భావిస్తున్నట్టు తెలిపారు..
Also Read
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఇక, రెండు డిస్కంలు రూ.1,0535 కోట్ల రెవెన్యూ లోటులో ఉన్నాయన తెలిపారు శ్రీరంగరావు.. 2023 – 24 సంవత్సరానికి ఎస్పీడీసీఎల్ రూ.36,963 కోట్లు, రూ. 17,095 కోట్ల రెవెన్యూ వస్తుందని భావిస్తున్నాం.. 2023 -24 సంవత్సరానికి రూ.54,060 కోట్ల రెవెన్యూను డిస్కంలు ఆశిస్తున్నాయని.. 10316 మిలియన్ యూనిట్ల లోటులో డిస్కంలు ఉన్నన్నాయని పేర్కొన్నారు తెలంగాణ ఈఆర్సీ ఛైర్మెన్ శ్రీరంగ రావు.. కాగా, తెలంగాణలో ఈ మధ్యే విద్యుత్ చార్జీలు పెరిగాయి.. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పచ్చజెండా ఊపడంతో.. విద్యుత్ ఛార్జీలను 14 శాతం పెంచేందుకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొమెస్టిక్ విద్యుత్ యూనిట్పై 40 నుంచి 50 పైసలు పెంచారు. ఇక ఇతర కేటగిరీలపై యూనిట్కు రూపాయి పెంచారు. ఛార్జీలను 19 శాతం పెంచుకునేందుకు వీలు కల్పించాలని ఈఆర్సీకి విజ్ఞప్తి చేశాయి. అయితే ఛార్జీలను 14 శాతం మేర పెంచుకునేందుకు ఈఆర్సీ అంగీకరించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇచ్చాయి. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ 6,831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని.. అంచనా వేశారు.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వచ్చాయి.. మరోవైపు ట్రాన్స్కో ఈఆర్సీకి సమర్పించిన టారిఫ్ల్లో రూ.9,128.57 కోట్ల లోటు ఉందని గతంలో వెల్లడించారు.. ఛార్జీల పెంపు తర్వాత లోటు రూ.2686.79 కోట్లు ఉంటుందని అంచనా వేసిన విషయం విదితమే కాగా.. మరోసారి డిస్కంలు.. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను తెలంగాణ ఈఆర్సీ ముందు పెట్టారు.. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
-
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
-
Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!