తెలంగాణలో కరోనా క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,900 శాంపిల్స్ పరీక్షించగా… 134 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు.
ఇదే సమయంలో 201 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,79,564 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,71,856 కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 4,015 కు చేరినట్టు బులెటిన్లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,693 యాక్టివ్ కేసులు ఉన్నాయి.