Telangana Congress: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్.. 26న చేవెళ్ల సభలో వైఖరి తేల్చనున్న కాంగ్రెస్
Telangana Congress: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆదివారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ నెల 26న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. ఈ సభలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇదే సభలో ఎస్సీ, ఎస్టీల ప్రకటనను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ విషయాలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో నేతలు చర్చించనున్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో పొందుపరిచిన అంశాలతోపాటు పొందుపరచాల్సిన అంశాలపై చర్చిస్తారు. ఈ నెల 26న చేవెళ్లలో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఖర్గేతో అసెంబ్లీ గురించి చర్చిస్తున్నారు.
Read also: First List Of BRS: ఆట మొదలైంది.. రేపు 105 మందితో తొలి జాబితా విడుదల..!
Also Read
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో పొందుపరచాల్సిన అంశాలపై దళిత నేతలతో భట్టి విక్రమార్క చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రైతులు, యువజన ప్రకటనలు చేసింది. చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. ఈ నెల 29న వరంగల్లో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ను విడుదల చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17న కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్లాన్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది. అభ్యర్థుల నుంచి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
Read also: KTR-Himanshu: అమెరికాకు హిమాన్షు.. ఎమోషనల్ అయిన కేటీఆర్
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రేను ఆదివారం కలిశారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాణిక్రావు ఠాక్రేతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. జగ్గారెడ్డి నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రచారాన్ని ఖండించారు. జగ్గారెడ్డి ఈరోజు మాణిక్ రావ్ ఠాక్రేతో సమావేశమై సోషల్ మీడియాలో ఈ వార్తలపై చర్చించినట్లు సమాచారం. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితోనూ జగ్గారెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.
IT Employees: ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!