Congress: రాహుల్తో తెలంగాణ నేతల కీలక భేటీ.. మధ్యలోనే బయటకు కోమటిరెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. అందులో భాగంగా.. నేతల మధ్య ఉన్న అసంతృప్తులకు చెక్ పెట్టే విధంగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.. అయితే, రాహుల్తో సమావేశం కొనసాగుతుండగానే మధ్యలోనే సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు పార్టీ సీనిరయర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. అందరితో కలిసి మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఒక్కొక్కరి అభిప్రాయాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.. అంతా కలిసి కట్టుగా ఉండాలనే సంకేతాలు ఇచ్చారు.. అయితే, టికెట్ల ప్రకటనపై రాహుల్ తో సమావేశంలో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. భేటీ ముగియక ముందే మధ్యలోనే బయటకి వచ్చేయడం చర్చగా మారింది.
Read Also: Uttarakhand: రాహుల్ గాంధీకి తన ఆస్తి మొత్తం రాసిచ్చేసిన వృద్ధురాలు
Also Read
- Bhatti Vikramarka: ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదు.. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం.!
- Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
- Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
- CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
అయితే, ఢిల్లీ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థుల సమావేశం కోసం బయటకు వచ్చినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు ఎంపీ కోమటిరెడ్డి.. జిల్లాల్లో పార్టీ బలోపేతం, పీసీసీ చీఫ్ వ్యవహార శైలిపై సమావేశంలో మాట్లాడినట్టు తెలిపిన ఆయన.. ఆర్నెళ్ల నుంచి ఏడాది ముందే అసెంబ్లీ అభ్యర్ధులను ఖరారు చేసి కార్యాచరణ చేపట్టాలని కోరాను.. కరీంనగర్ జిల్లాలో ఒకట్రెండు అసెంబ్లీ స్థానాలకు పీసీసీ చీఫ్ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు.. అభ్యర్థులను ప్రకటించే ముందు ఆ జిల్లాల్లో సీనియర్లుగా ఉన్న జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులతో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారు? అని ప్రశ్నించిన ఆయన.. అభ్యర్థుల ప్రకటించేందుకు అధిష్టానం అనుమతి ఇచ్చిందా..? అని కూడా నిలదీశారు. ఇలా ముందే ప్రకటించటం వల్ల సీనియర్లపై ఒత్తిడి పెరుగుతుందని.. కాంగ్రెస్ పార్టీ సిస్టంలోనే ముందుకు పోవాలి కదా? అని ప్రశ్నించారు.. ఈ విషయాలను రాహుల్ గాంధీకి చెప్పి సమావేశం నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ల సంబరాలకు డబ్బు ఎక్కడిది.? మహేష్ జెఠ్మలానీ అనుమానాలు..
-
Bank of Baroda Data Leak: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ డేటా లీక్? ప్రమాదంలో కోట్లాది కస్టమర్ల సమాచారం!
-
2020 Delhi Riots Case: తాహిర్ హుస్సేన్కు ఉరిశిక్ష విధించాలి.. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు..
-
US: ఫుడ్ ఫెస్టివల్లో కాల్పులు.. ముగ్గురు మృతి
-
Salman Khan: సల్మాన్కు ఊరట.. ‘బ్లాక్ బక్’ టీజర్ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!