KCR: దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. లేకపోతే నష్టం తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీపై మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని.. లేకపోతే తీవ్రస్థాయిలో నష్టం తప్పదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని, మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని తెలిపారు. 12శాతం జీడీపీ వృద్ధి ఉండే ఎక్కడైనా ఆరేళ్లలో రెట్టింపు అవుతుందని కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం ప్రధాని మోదీ అవసరం దేశానికి లేదని.. 2025 నాటికి రూ.5లక్షల కోట్ల ఆర్థిక వృద్ధికి ప్రధాని, ఆర్థిక మంత్రి అవసరం లేదని.. అది సహజంగా జరిగేదేనని చెప్పారు. చేతనైతే చైనా, సింగపూర్లాగా దేశాన్ని మార్చాలని హితవు పలికారు. దేశంలో బ్యాంకులను ముంచి పారిపోయిన దొంగలందరూ మోదీకి దోస్తులే అని కేసీఆర్ ఆరోపించారు. ఇది నిజం కాదా అని ఆయన బీజేపీ నేతలను నిలదీశారు.
ఇవన్నీ వదిలిపెట్టి తనను జైలుకు పంపుతామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని.. వీళ్లను చూస్తే తనకు జాలి కలుగుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దమ్మున్నవాళ్లయితే తనను జైలులో వేసి చూడాలన్నారు. అయినా తప్పు చేసినోళ్లే అలాంటి వ్యాఖ్యలకు భయపడతారని.. తమకు భయం లేదన్నారు. దేశంలో రాఫెల్ కుంభకోణం బయటకు రావాలని.. అందులో దొంగలు బయటపడాలని కేసీఆర్ పేర్కొన్నారు. రాఫెల్పై రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధవిమానాలను 9.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందని.. అటు ఇండోనేషియా దేశం 42 రాఫెల్ యుద్ధవిమానాలను కేవలం 8 బిలియన్ డాలర్లకే కొన్నదన్నారు. మన కంటే తక్కువ ధరకే ఇండోనేషియా కొనుగోలు చేసిందన్నారు. పైగా ఇండోనేషియా 6 విమానాలు ఎక్కువగా కొనుగోలు చేసిందన్నారు. ఇప్పుడు తెలియడంలేదా ఎవడు దొంగ అనేది అని కేసీఆర్ నిలదీశారు. ఎవడు జైలుకు పోతాడో వాడే పోవాలి అని.. తాను ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనని కేసీఆర్ తెలిపారు. ఢిల్లీలో దీనిపై వందశాతం పంచాయితీ పెడతామన్నారు. మోదీ ప్రభుత్వ అవినీతిపై తాము సుప్రీంకోర్టులో కేసు వేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
Also Read
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!