KCR: బోయిగూడ అగ్నిప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు.. స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి.. అందులో మొత్తం 12 మంది ఉండగా.. ఓ యువకుడు మాత్రం.. మంటలు చెలరేగిన తర్వాత.. గోడ దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.. కానీ, మరో 11 మంది సజీవదహనం అయ్యారు.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు కాలిపోయినట్టు అధికారులు వెల్లడించారు.. ఇక, ఘటనా స్థలాన్ని సీఎస్ సోమేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తదితరులు పరిశీలించారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు.
Read Also: ED Raids: టార్గెట్ మహా సర్కార్..? ఈడీ రైడ్స్ కలకలం..
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
అగ్ని ప్రమాదంలో బీహార్ కార్మికులు మరణించడం పట్ల సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్.. అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు తెలంగాణ సీఎం.. మృతుల కుటుంబాలకు ఆ మొత్తాన్ని అందజేయనున్నారు. ఇక, ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల పార్థివదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ను ఆదేశించారు సీఎం కేసీఆర్. మరోవైపు ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం సోమేష్ కుమార్.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.. చనిపోయిన వాళ్లంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్లు.. వారి వారి ప్రాంతాలకు మృతదేహాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.. ఇలాంటి ఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అవసరమైన చర్యలు చేపడుతున్నాం అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!