Kendriya Vidyalaya : పండుగవేళ తెలంగాణకు కేంద్రం శుభవార్త
- కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు
- తెలంగాణకు మంజూరైన నాలుగు కొత్త విశ్వవిద్యాలయాలు
- పీఎం-శ్రీ స్కూల్స్, ట్రైబల్ యూనివర్సిటీ , నిధుల కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kendriya Vidyalaya : తెలంగాణలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా సమగ్ర మద్దతు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణలో స్థాపించేందుకు కేటాయించినట్లు ప్రకటించబడింది. ఇప్పటికే రాష్ట్రంలో 35 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త నాలుగు విద్యాలయాలు మరమ్మూల ప్రాంతాల్లోనూ నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్య అందించడంలో కీలక పాత్ర వహించనున్నాయి.
తెలంగాణకు మంజూరైన నాలుగు కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా, జగిత్యాల రూరల్ మండలం చెల్గల్, వనపర్తి జిల్లా నాగవరం శివార్ లో కేంద్రం కలిగి ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా వంటి ప్రాంతాలు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లు, గిరిజన ప్రాంతాలు కావడంతో, ఇక్కడ ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయాలు విద్యను సమానంగా అందించే దిశగా కీలకం అవుతాయి.
Also Read
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ఇవి కాకుండా, గత రెండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యకు రూ.400 కోట్లతో 794 పీఎం-శ్రీ స్కూల్స్ను మంజూరు చేసింది. పీఎం-శ్రీ స్కూల్స్ కోసం దేశవ్యాప్తంగా ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. సమగ్ర శిక్షా అభియాన్ కింద కూడా ఈ రెండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి దాదాపు రూ.2 వేల కోట్లను కేటాయించింది.
అంతే కాక, ములుగు జిల్లాలో సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విశ్వవిద్యాలయం స్థానిక ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉన్నత విద్యా అవకాశాలను సమానంగా అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించనుంది.
మొత్తంగా, కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రీయ విద్యా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యా రంగంలో నాణ్యత, సమగ్రతను పెంచే దిశగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
తాజావార్తలు
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!