తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేత..? కీలక నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కోసం విధించిన లాక్డౌన్ను ఎత్తివేసే ఆలోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. మొదటల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే సడలింపులు ఇచ్చిన సర్కార్.. ఆ తర్వాత సడలింపుల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచింది.. కేసులు తగ్గడంతో.. ఆ వెసులు బాటను 12 గంటల ఇచ్చింది. దీంతో.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు.. ఆపై లాక్డౌన్ అమలు చేశారు. ఇక, ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. లాక్డౌన్ను పూర్తిగా సడలించే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటల రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది.. లాక్డౌన్, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోత, జలవిద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఇవాళ్టితో ముగియనున్న లాక్డౌన్ను మరికొన్ని రోజులు పొడిగించాలా? లేదా మరిన్ని సడలింపులు ఇవ్వాలా? మొత్తానికే లాక్డౌన్ తీసేయాలా? అనే దానిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే, ఈనెల 20 తర్వాత లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నైట్కర్ఫ్యూ మాత్రం కఠినంగా అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచనలు ఉన్నారు.. పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు వీలుగా రోజంతా సాధారణ కార్యకలాపాలను అనుమతించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ దశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. మహమ్మారి మళ్లీ పంజా విసిరితే ఎలా ఎదుర్కోవాలి అనే ప్రణాళికలపై కూడా కేబినెట్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇక, ఈ సారి సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్తున్న నేపథ్యంలో పంటల సాగుపై మంత్రివర్గం పలు అంశాలను చర్చించనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి వివిధ రిజర్వాయర్లను నింపడం, అక్కడి నుంచి చెరువులు, కుంటలను నింపడంపైనా చర్చించనున్నారు. ఇదే సమయంలో.. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!