Site icon NTV Telugu

తెలంగాణలో కఠిన ఆంక్షలు..? కీలక భేటీకి సిద్ధమైన కేసీఆర్

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోన్న సమయంలో.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సూచనలతో ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌పై తాజా పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో.. కేబినెట్‌ సమావేశం నిర్వహించడానికి సిద్ధం అయ్యారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది.

Read Also: బ్రేకింగ్‌: తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు

దేశంలో, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు సీఎం కేసీఆర్‌.. ఇప్పటికే విద్యా సంస్థల సెలవులు పొడిగించిన నేపథ్యం ఓవైపు.. కోవిడ్‌ కట్టడికి ఇతర రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌ విధిస్తోన్న సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? మళ్లీ లాక్‌డౌన్‌ పెడతారా? లేక నైట్‌ కర్ఫ్యూ విధిస్తారా? లేదా.. మరో విధంగా ఆంక్షలు పెడతారా? సినిమా థియేటర్ల పరిస్థితి ఏంటి? పబ్లిక్‌ ప్లేస్‌లలో ఎలాంటి ఆంక్షలు పెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. విద్యా సంస్థలకు సెలవులు 30వ తేదీ వరకు పొడిగించినా.. ఈ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు ఉంటాయా? లేదా? అనేది కూడా రేపటి కేబినెట్‌ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version