Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Bjp Focus On Rrrr Munugodu Bypoll Strategy

RRRR… Bjp Josh In Telangana: నాలుగో ’ఆర్‘ లక్ష్యంగా బీజేపీ దూకుడు

Published Date :August 3, 2022 , 6:41 pm
By NTV WebDesk
RRRR… Bjp Josh In Telangana: నాలుగో ’ఆర్‘ లక్ష్యంగా బీజేపీ దూకుడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

RRRR… Bjp Josh In Telangana తెలంగాణలో ఉప ఎన్నికలు (Munugodu by election) జరగడం అందులో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడడం మామూలే. అంతిమంగా అటు టీఆర్ఎస్ గానీ, ఇటు బీజేపీ గానీ గెలిచేవి. ముందస్తు ఎన్నికల తర్వాత దుబ్బాక, హుజూర్ నగర్, హుజూరాబాద్, నాగార్జున సాగర్ స్థానాలకు వివిధ కారణాల వల్ల ఉప ఎన్నికలు జరిగాయి.ఇందులో దుబ్బాక, హుజూరాబాద్ స్థానాల్లో బీజేపీ విజయబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుపై ఫోకస్‌ పెట్టింది బీజేపీ. …తరుణ్ చుగ్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

త్వరలోనే ఇంచార్జుల నియామకం జరుగుతుందని తెలుస్తోంది. పార్టీ తరపున సర్వేల నిర్వహణ (Bjp Surveys) షురూ అయింది. వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది కమలదళం. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ బాస్ బండిసంజయ్‌ ఆ నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టారు. కాంగ్రెస్‌పార్టీ నుండి గెలుపొందిన కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడానికి మొగ్గు చూపుతున్న తరుణంలో ఉప ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నారు బండి.

Also Read

  • Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
  • Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
  • Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
  • Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!

2018 ఉప ఎన్నికల తరువాత అసెంబ్లీలో ఒకే సీటుకు పరిమితమైన బీజేపి బండి సంజయ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరువాత దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను మూడుకు పెంచారు. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లు ’ట్రిపుల్ ఆర్‘ గా ప్రాచుర్యం పొందారు. ఈ నేపథ్యంలో మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం ద్వారా మరో ఎమ్మెల్యే సీటును సొంతం చేసుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. మునుగోడులో గెలిచి బీజేపీ ఖాతాలో నాలుగవ ఆర్ ను చేర్చే దిశగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా పాదయాత్ర లంచ్ విరామ సమయంలో బండి సంజయ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి .కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్ రావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా, ఉప ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌కు ధీటుగా పోరాడుతున్న బీజేపీ రాష్ట్రశాఖ కూడా అధికారపార్టీని ఎదుర్కోవడానికి అన్నివిధాలుగా రాష్ట్ర శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు తెలిసింది.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 7 మండలాలు చౌటుప్పల్‌, నారాయణపూర్‌, గట్టుప్పల్‌, చండూర్‌, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, రెండు మున్సిపాల్టీలు చౌటుప్పల్‌, చండూర్‌ లో పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి బిజెపి కి సంబంధించిన రాష్ట్ర నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Devarkadra BJP Politics: ఎవరికి వారే యమునా తీరే..! నలుగురూ నాలుగు దిక్కులు

దుబ్బాక, హుజురాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి పార్టీ సీనియర్ నేతను మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఇంచార్జ్ గా నియమించాలని ఇప్పటికే పార్టీలోని సీనియర్‌ నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులకు సూచించారు. మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి లక్కీ హ్యాండ్‌ అని ఆయనను ఇంచార్జీగా నియమిస్తే ఉప ఎన్నికల్లో గెలుపొందడం తధ్యమనే భావన కమలం శ్రేణుల్లో ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలవడం కోసం పార్టీ సీనియర్‌ నాయకులు అందరి సేవలను ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తోంది.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎవర్ని ఇంచార్జీని పెట్టాలనే విషయంపై త్వరలోనే బిజెపి పార్టీకి సంబంధించిన కోర్‌కమిటి సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర సీనియర్‌నాయకులతో సంప్రదించనున్నారు. ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి, వివిధ మండలాలకు, మున్సిపాల్టీలకు ఇంచార్జ్‌ను నియమించే యోచనలో బండి సంజయ్‌ ఉన్నారు. 2009, 2014, 2018 లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన సీనియర్‌ నాయకుడు, బిజెపి రాష్ట్రశాఖ ఉపాధ్యక్షులు డా.జి.మనోహర్‌రెడ్డితో, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బిజెపి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలతో ఇప్పటికే పలుదఫాలు నియోజకవర్గంలోనే నెలకొన్న పరిస్థితులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సమీక్షించారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా చూస్తే గౌడ్లు, యాదవులు, రెడ్డి, పద్మశాలి, లంబాడ, మాదిగ సామాజికవర్గాలవారు అధికంగా ఉన్నారు. సామాజికవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఇంచార్జీలను నియమించేటప్పుడు వీరికి అధికప్రాధాన్యత ఇచ్చే యోచనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయపరిస్థితులపై వివిధ సంస్థలచేత పలు సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సర్వే రిపోర్డుల ఆధారంగా ముందుకు వెళ్ళాలని పార్టీ యోచిస్తుంది. మునుగోడు ఉప ఎన్నికపై కేంద్రనాయకత్వానికి ఒక నివేదికను పార్టీ రాష్ట్రశాఖ తరుపున పంపినట్టు తెలుస్తోంది. మొత్తం మీద నాలుగో ఆర్ బీజేపీ తరఫున అసెంబ్లీకి వెళ్ళడం ఖాయమని ధీమాతో వున్నారు బీజేపీ నేతలు.

Raghunandan Rao LIVE : మిత్రమా రేవంత్…అంటూ స్వీట్ వార్నింగ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp plans
  • BJP vs TRS
  • by election
  • dubbaka

తాజావార్తలు

  • Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీకి నేతలకు సజ్జల హెచ్చరికలు

  • Abhishek-Travis Head: అభిషేక్‌ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..

  • Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!

  • Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..

  • AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions