NTV Telugu Site icon

BJP: బీజేపీ కీలక నిర్ణయం.. 12 మంది జిల్లా అధ్యక్షుల మార్పు..!

Bjp

Bjp

BJP: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పలువురు జిల్లా అధ్యక్షులను మార్చారు. చాలా జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. అలాగే, ఆరుగురు కొత్త బీజేపీ మోర్చా అధ్యక్షులను నియమించింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడంపై బీజేపీ తెలంగాణ నాయకత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో పలువురు జిల్లా అధ్యక్షులను మార్చారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి సమాచారం అందించారు.

కొత్తగా ఆరుగురు మోర్చాల అధ్యక్షులుగా నియమితులయ్యారు

ST మోర్చా – కళ్యాణ్ నాయక్

ఎస్సీ మోర్చా – కొండేటి శ్రీధర్

యువమోర్చా – మహేందర్

OBC మోర్చా – ఆనంద్ గౌడ్

మహిళా మోర్చా – డా.శిల్ప

కిసాన్ మోర్చా – పెద్దోళ్ల గంగారెడ్డి.

Read also: Wheat Stocks: దేశంలో గోధుమల కొరత.. భారీగా తగ్గిన నిల్వలు..

కొత్త అధ్యక్షులు వీరే..

నిజామాబాద్ – దినేష్ కుమార్

పెద్దపల్లి – చందుపట్ల సునీల్

సంగారెడ్డి – గోదావరి అంజిరెడ్డి

సిద్దిపేట – మోహన్ రెడ్డి

యాదాద్రి – పాశం భాస్కర్

వనపర్తి – డి నారాయణ

వికారాబాద్ – మాధవరెడ్డి

నోల్గొండ – డాక్టర్ వర్షిత్ రెడ్డి

ములుగు – బలరాం

మహబూబ్ నగర్ – పి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్ – గంటా రవి

నారాయణపేట – జలంధర్ రెడ్డి.
Rohit Sharma: భారత జట్టు ఇంకా ఖరారు కాలేదు.. 8-10 మంది ఆటగాళ్లు మదిలో ఉన్నారు!