CM Revanth Reddy : తెలంగాణలో జంతు సంరక్షణకు పెద్దపీట
- జంతు సంరక్షణపై సీఎం సమీక్ష
- గోశాలల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు
- వీధి కుక్కల నియంత్రణపై చర్యలు
- ప్రభుత్వ చర్యలకు మేనకా గాంధీ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణ , జంతువుల సంక్షేమం కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం శాసనసభ సమావేశ హాలులో ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త, ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ అధ్యక్షురాలు మేనకా గాంధీ నేతృత్వంలోని బృందంతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా జంతు సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు.
గోసంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగా ఎన్కేపల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కేవలం ఎన్కేపల్లిలోనే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల సమీపంలో కూడా గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోవుల పోషణ , రక్షణ కోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Also Read
మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి , వాటి సంరక్షణ కోసం చేపట్టిన చర్యలను అధికారులు మేనకా గాంధీ బృందానికి వివరించారు. ముఖ్యంగా వీధి కుక్కలకు నిర్వహిస్తున్న స్టెరిలైజేషన్ (కుక్కల నియంత్రణ) ప్రక్రియపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. క్యూర్ (CURE) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జంతువుల పట్ల క్రూరత్వాన్ని అరికట్టడానికి , వాటికి మెరుగైన వసతులు కల్పించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను అధికారులు వివరించారు.
జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతపై మేనకా గాంధీ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ముఖ్యంగా స్టెరిలైజేషన్ , గోశాలల నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం చూపిస్తున్న చొరవను అభినందిస్తూ, జంతువుల సంక్షేమం పట్ల ఇదే నిబద్ధతను కొనసాగించాలని ఆమె కోరారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు పలువురు మున్సిపల్ కమిషనర్లు , ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జంతు ప్రేమికులకు , పర్యావరణ హితంగా రాష్ట్ర అభివృద్ధిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ భేటీ ద్వారా స్పష్టమైంది.
తాజావార్తలు
-
India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
-
World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!