CM Revanth Reddy : తెలంగాణలో జంతు సంరక్షణకు పెద్దపీట
- జంతు సంరక్షణపై సీఎం సమీక్ష
- గోశాలల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు
- వీధి కుక్కల నియంత్రణపై చర్యలు
- ప్రభుత్వ చర్యలకు మేనకా గాంధీ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణ , జంతువుల సంక్షేమం కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం శాసనసభ సమావేశ హాలులో ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త, ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ అధ్యక్షురాలు మేనకా గాంధీ నేతృత్వంలోని బృందంతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా జంతు సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు.
గోసంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగా ఎన్కేపల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కేవలం ఎన్కేపల్లిలోనే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల సమీపంలో కూడా గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోవుల పోషణ , రక్షణ కోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Viral Divorce: పెళ్లి కోసం వయసు తగ్గించి చెప్పిన భర్త.. కోర్టుకు వెళ్లి విడాకులు తెచ్చుకున్న భార్య..
- Ration Card: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇంటికి రేషన్ కార్డు జారీ.. MRO ఏమన్నారంటే..
- Narahari Rao : బ్యాంక్ లాకర్ తెరిస్తే షాక్.. నరహరి దాచిన నోట్ల కట్టలు, కిలోల బంగారం.!
మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి , వాటి సంరక్షణ కోసం చేపట్టిన చర్యలను అధికారులు మేనకా గాంధీ బృందానికి వివరించారు. ముఖ్యంగా వీధి కుక్కలకు నిర్వహిస్తున్న స్టెరిలైజేషన్ (కుక్కల నియంత్రణ) ప్రక్రియపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. క్యూర్ (CURE) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జంతువుల పట్ల క్రూరత్వాన్ని అరికట్టడానికి , వాటికి మెరుగైన వసతులు కల్పించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను అధికారులు వివరించారు.
జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతపై మేనకా గాంధీ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ముఖ్యంగా స్టెరిలైజేషన్ , గోశాలల నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం చూపిస్తున్న చొరవను అభినందిస్తూ, జంతువుల సంక్షేమం పట్ల ఇదే నిబద్ధతను కొనసాగించాలని ఆమె కోరారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు పలువురు మున్సిపల్ కమిషనర్లు , ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జంతు ప్రేమికులకు , పర్యావరణ హితంగా రాష్ట్ర అభివృద్ధిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ భేటీ ద్వారా స్పష్టమైంది.
తాజావార్తలు
-
Ex-Terrorist: ఉగ్రవాదుల జేబుల్లో కండోమ్, ప్రేమ లేఖలు..ధురంధర్లో చూపించి నిజమే: మాజీ ఉగ్రవాది..
-
Sajjala Ramakrishna Reddy: గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
-
Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
-
Meloni-Trump: ముందు మీ ప్రజాదరణ చూసుకోండి.. ట్రంప్పై మరోసారి మెలోని తీవ్ర ఆగ్రహం
-
Fathers Day: వెన్నుతట్టి నడిపించే ధైర్యం ‘నాన్న’.. ఫాదర్స్ డే (జూన్ 21) సందర్భంగా బెస్ట్ కొటేషన్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!