CM Revanth Reddy : తెలంగాణలో జంతు సంరక్షణకు పెద్దపీట
- జంతు సంరక్షణపై సీఎం సమీక్ష
- గోశాలల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు
- వీధి కుక్కల నియంత్రణపై చర్యలు
- ప్రభుత్వ చర్యలకు మేనకా గాంధీ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణ , జంతువుల సంక్షేమం కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం శాసనసభ సమావేశ హాలులో ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త, ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ అధ్యక్షురాలు మేనకా గాంధీ నేతృత్వంలోని బృందంతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా జంతు సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు.
గోసంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగా ఎన్కేపల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కేవలం ఎన్కేపల్లిలోనే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల సమీపంలో కూడా గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోవుల పోషణ , రక్షణ కోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Also Read
మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి , వాటి సంరక్షణ కోసం చేపట్టిన చర్యలను అధికారులు మేనకా గాంధీ బృందానికి వివరించారు. ముఖ్యంగా వీధి కుక్కలకు నిర్వహిస్తున్న స్టెరిలైజేషన్ (కుక్కల నియంత్రణ) ప్రక్రియపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. క్యూర్ (CURE) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జంతువుల పట్ల క్రూరత్వాన్ని అరికట్టడానికి , వాటికి మెరుగైన వసతులు కల్పించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను అధికారులు వివరించారు.
జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతపై మేనకా గాంధీ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ముఖ్యంగా స్టెరిలైజేషన్ , గోశాలల నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం చూపిస్తున్న చొరవను అభినందిస్తూ, జంతువుల సంక్షేమం పట్ల ఇదే నిబద్ధతను కొనసాగించాలని ఆమె కోరారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు పలువురు మున్సిపల్ కమిషనర్లు , ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జంతు ప్రేమికులకు , పర్యావరణ హితంగా రాష్ట్ర అభివృద్ధిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ భేటీ ద్వారా స్పష్టమైంది.
తాజావార్తలు
-
Senior Hero : సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న హీరో
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Tamil Cinema : హిట్ కొట్టు.. కార్లు పట్టు.. కోలీవుడ్ కొత్త కల్చర్
-
Pawan Kalyan: ప్రజలతో మరింతగా మమేకం కావాలి.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
-
HMD Arc 2: 5000mAh బ్యాటరీ, AI కెమెరాతో చవకైన స్మార్ట్ఫోన్.. HMD ఆర్క్ 2 విడుదల
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!