Nepal Education Revolution: విద్యార్థి సంఘాలకు షాక్.. క్యాంపస్ల నుంచి రాజకీయాలు అవుట్.. 60 రోజుల్లో ఖాళీ చేయాల్సిందే!
- పాఠశాలకు విదేశీ పేర్లు నిషేధం
- నేపాల్ విద్యావ్యవస్థలో పెనుమార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Education Revolution: నేపాల్ నూతన ప్రధాని బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం విద్యా రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో సంచలనం సృష్టించింది. విద్యను రాజకీయాల కోరల నుంచి విముక్తి చేసి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘100 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ను శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.
READ ALSO: Nara Lokesh: కార్యకర్తలే పార్టీ బలం.. టీడీపీ ఆవిర్భావ సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!
Also Read
- RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
రాజకీయ రహిత క్యాంపస్లే లక్ష్యం..
విద్యాసంస్థలు ఇకపై విజ్ఞాన కేంద్రాలుగా మాత్రమే విరాజిల్లాలని, రాజకీయ వేదికలుగా మారకూడదని బాలెన్ మంత్రివర్గం స్పష్టం చేసింది. ప్రధానంగా రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న విద్యార్థి సంఘాలను విద్యాసంస్థల నుంచి పూర్తిగా నిషేధించింది. రాబోయే 60 రోజుల్లోగా అటువంటి సంఘాల కార్యాలయాలను, నిర్మాణాలను విద్యా ప్రాంగణాల నుంచి తొలగించాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. పార్టీ రాజకీయాలకు బదులుగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ‘విద్యార్థి మండలి’ (వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్) వంటి రాజకీయేతర యంత్రాంగాలను 90 రోజుల్లోగా ఏర్పాటు చేయనున్నారు.
కార్యాచరణ ప్రణాళికలోని 5 కీలక అంశాలు ఇవే..
* విద్యార్థి రాజకీయాలపై నిషేధం: పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల కార్యకలాపాలపై తక్షణ నిషేధం విధించారు.
* విదేశీ పేర్ల తొలగింపు: ఆక్స్ఫర్డ్, పెంటగాన్, సెయింట్ జేవియర్స్ వంటి విదేశీ పేర్లతో కొనసాగుతున్న విద్యాసంస్థలు ఇకపై తమ పేర్లను ‘అసలైన నేపాలీ పేర్లు’గా మార్చుకోవాల్సి ఉంటుంది.
* పరీక్షలు లేని బాల్యం: 5వ తరగతి వరకు విద్యార్థులకు సాంప్రదాయ పరీక్షలను రద్దు చేశారు. వారి ప్రగతిని అంచనా వేయడానికి ‘ప్రత్యామ్నాయ మూల్యాంకన విధానాన్ని’ అమలు చేస్తారు.
* పౌరసత్వ నిబంధన తొలగింపు: పట్టభద్రత కోసం నేపాల్ పౌరసత్వం తప్పనిసరి అనే నిబంధనను ఎత్తివేశారు. దీనివల్ల పత్రాల సమస్యతో ఏ విద్యార్థి చదువు ఆగిపోకుండా భరోసా కల్పించారు.
* సకాలంలో ఫలితాలు: రాజకీయ జోక్యం వల్ల పరీక్షల ఫలితాల్లో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టేందుకు, ఇకపై అకడమిక్ క్యాలెండర్ ప్రకారం కచ్చితంగా ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
విద్యా క్యాలెండర్ సక్రమంగా లేకపోవడం వల్ల వేలాది మంది నేపాలీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వలస వెళ్తున్నారు. బాలెన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచి, విద్యార్థుల వలసలను తగ్గిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పులతో నేపాల్ విద్యా రంగం కొత్త పుంతలు తొక్కనుందని చెబుతున్నారు.
READ ALSO: Korukonda Crime: కిలాడి లేడీ.. ఇన్సూరెన్స్ కోసం క్రైమ్ డ్రామా, చివరలో ట్విస్ట్!
తాజావార్తలు
-
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
-
Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
-
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
-
Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
-
Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!