Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
- మామునూరుకు టెండర్లు
- ఆదిలాబాద్లో ఎంఆర్ఓ
- హెలీ టూరిజంపై ఫోకస్
- హుస్సేన్ సాగర్లో సీ ప్లేన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని ఆదిలాబాద్, మామునూరు (వరంగల్) విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రితో బుధవారం సమావేశమైన సీఎం, మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావలసిన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంఆర్ఓ వసతులు
ఆదిలాబాద్ విమానాశ్రయంలో ప్యాసింజర్, కార్గో టెర్మినళ్లతో పాటు ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్) సదుపాయాలను కూడా కల్పించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అక్కడ రన్వేను ఖరారు చేసేందుకు గాను రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులతో వెంటనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి, మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించి రెండు వారాల్లో టెండర్లు పిలిచి, డిసెంబరు నాటికి వాటిని ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే డిసెంబరులోనే పనులకు శంకుస్థాపన కూడా చేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.
Also Read
హెలీ టూరిజం, సీ ప్లేన్ ల్యాండింగ్
రాష్ట్రంలో ఛాపర్ల (హెలికాప్టర్లు) ద్వారా ‘హెలీ టూరిజం’ను ప్రోత్సహించాలని, దీనివల్ల తెలంగాణ పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కాగా, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో సీ ప్లేన్ ల్యాండింగ్కు ఉన్న అవకాశాలపై రూపొందించిన అధ్యయన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం. అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, సీఎస్ సంజయ్ జాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
-
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!